కరెంట్ అఫైర్స్
2022 నవంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 108 అడుగుల ఎత్తయిన శ్రీనాథ ప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ) ఏ నగరంలో
మాదిరి ప్రశ్నలు
2022 నవంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 108 అడుగుల ఎత్తయిన శ్రీనాథ ప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ) ఏ నగరంలో ఆవిష్కరించారు?
జ: బెంగళూరు
‘ది లాస్ట్ హీరోస్: ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం’ పుస్తకాన్ని ఎవరు రచించారు?
జ: పాలగుమ్మి సాయినాథ్ (ఈ పుస్తకం స్వాతంత్య్రం కోసం పోరాడిన అజ్ఞాతవీరుల జీవిత గాథలను తెలుపుతుంది)
గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జీపీఏఐ) కు 2022-23 కు గానూ ఏ దేశం అధ్యక్ష హోదాను దక్కించుకుంది?
జ: భారతదేశం
కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) 2022, అక్టోబరు 31 నుంచి నవంబరు 6 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ను ఏ థీమ్తో నిర్వహించింది?
జ: కరప్షన్ ఫ్రీ ఇండియా ఫర్ ఎ డెవలప్మెంట్ నేషన్
2022 నవంబరులో లండన్లో నిర్వహించిన వరల్డ్ ట్రావెల్ మార్ట్లో ఏ రాష్ట్ర పర్యాటక శాఖ రెస్పాన్సిబుల్ టూరిజం గ్లోబల్ అవార్డును గెలుచుకుంది? జ: కేరళ
రాజస్థాన్లోని ఏ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించింది?
జ: మాన్గఢ్ ధామ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.