AP EAPCET: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగం కీ విడుదల
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశామని, దీనిపై అభ్యంతరాలుంటే 26వ తేదీ ఉదయం 9 లోపు తెలపొచ్చని ఈఏపీసెట్ ఛైర్మన్ రంగజనార్ధన, కన్వీనర్ శోభాబిందు తెలిపారు.
అనంతపురం (జేఎన్టీయూ), న్యూస్టుడే: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశామని, దీనిపై అభ్యంతరాలుంటే 26వ తేదీ ఉదయం 9 లోపు తెలపొచ్చని ఈఏపీసెట్ ఛైర్మన్ రంగజనార్ధన, కన్వీనర్ శోభాబిందు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల కీ 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రాథమిక కీ ఈఏపీసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ నెల 15న మొదలైన ఈఏపీసెట్ పరీక్షలకు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ