AP EAPCET: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగం కీ విడుదల
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశామని, దీనిపై అభ్యంతరాలుంటే 26వ తేదీ ఉదయం 9 లోపు తెలపొచ్చని ఈఏపీసెట్ ఛైర్మన్ రంగజనార్ధన, కన్వీనర్ శోభాబిందు తెలిపారు.

అనంతపురం (జేఎన్టీయూ), న్యూస్టుడే: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశామని, దీనిపై అభ్యంతరాలుంటే 26వ తేదీ ఉదయం 9 లోపు తెలపొచ్చని ఈఏపీసెట్ ఛైర్మన్ రంగజనార్ధన, కన్వీనర్ శోభాబిందు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల కీ 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రాథమిక కీ ఈఏపీసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ నెల 15న మొదలైన ఈఏపీసెట్ పరీక్షలకు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని