ఉద్యోగ పరీక్షలకు వ్యూహం ఇదిగో!
ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ప్రకటించిన నియామక పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్షను జులై 24న, జూనియర్ అసిస్టెంట్ పరీక్షను జులై 31న నిర్వహించనున్నారు. రెండింటికీ స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయి. పరీక్షా సమయం సమీపిస్తుండటంతో పరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపేందుకు అభ్యర్థులు ఏ వ్యూహాన్ని పాటించాలో తెలుసుకుందాం!
ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ప్రకటించిన నియామక పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్షను జులై 24న, జూనియర్ అసిస్టెంట్ పరీక్షను జులై 31న నిర్వహించనున్నారు. రెండింటికీ స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయి. పరీక్షా సమయం సమీపిస్తుండటంతో పరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపేందుకు అభ్యర్థులు ఏ వ్యూహాన్ని పాటించాలో తెలుసుకుందాం!
ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్ష
హిందూ తాత్వికత- దేవాలయ వ్యవస్థకు స్క్రీనింగ్ పరీక్షలో 150 ప్రశ్నలకు గాను 100మార్కుల ప్రాధాన్యం ఉంది. ఇప్పుడున్న సమయంలో అత్యధిక వ్యవధిని ఈ విభాగానికి కేటాయించాలి. ఈ విభాగంలో సిలబస్ విస్తృతమైనప్పటికీ ప్రశ్నల స్థాయి ప్రాథమిక స్థాయిలో ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 1, 2 పరీక్షల అనుభవమున్న సీనియర్ అభ్యర్థులకు కూడా ఈ విభాగం కొత్తదే. అభ్యర్థులందరి భవిష్యత్తునూ నిర్ణయించే విభాగంగా దీన్ని గుర్తించవచ్ఛు అందువల్ల ఈ విభాగంపై వీలైనన్నిసార్లు పునశ్చరణ చేయటం మంచిది.
* హిందూ తాత్వికత- దేవాలయ వ్యవస్థకు సంబంధించిన సమాచారం చదువుతున్నప్పుడు తేలికగానే అర్థం అవుతూ ఉంటుంది. పైగా కొంతవరకు జనరల్ స్టడీస్ విభాగంలో అనుసంధానమై ఉన్నందున అవగాహన త్వరగానే ఏర్పడుతుంది. అయితే సంబంధిత సమాచారాన్ని బిట్ల రూపంలో మార్చుకుని చదవటం కొద్దిగా క్లిష్టమైన ప్రక్రియ. ఆబ్జెక్టివ్ తరహాలో వీలైనన్ని బిట్లను టెస్టుల రూపంలో సాధన చేయటం ద్వారా మాత్రమే ఈ సమస్యనుంచి గట్టెక్కవచ్ఛు ఈ విషయాన్ని ప్రతి అభ్యర్థీ శ్రద్ధగా పట్టించుకోవాలి.
* 10, 11, 12 చాప్టర్లలో పేర్కొన్న దేవాలయ ఆదాయ వ్యవస్థ, దేవాలయ భూముల నిర్వహణ, ఎండోమెంట్ ఆఫీసర్స్ ఉద్యోగ బాధ్యతలు, ఎండోమెంట్ చట్టం మొదలైన విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా రివిజన్ చేయాలి.
* అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత అద్వైత, వీరశైవ మొదలైన తాత్విక అంశాలను ప్రాథమిక స్థాయిలో నేర్చుకుంటే సరిపోతుంది. తులనాత్మకంగా ఒకదానితో మరొకటి పోల్చుకోవడం ద్వారా ఈ స్థాయి పరీక్షలో వచ్చే ప్రశ్నలను ఎదుర్కోవచ్ఛు
* రామాయణ, మహాభారత, భాగవతాలూ, పురాణాలూ సిలబస్లో ఉన్నాయి. దీనిలో పేర్కొన్నదాని ప్రకారం ప్రాథమిక స్థాయి సమాచారానికి అధిక పాత్ర ఉంటుంది. వివిధ పాత్రల, ప్రదేశాల గురించి సిలబస్లో ఉన్నందున ఆ తరహా ప్రశ్నలను అంచనా వేయవచ్ఛు జరిగిన సంఘటనలు, క్రియలు ఆధారం చేసుకుని అందులో కీలక పాత్రధారి ఎవరు, అది ఎక్కడ జరిగింది అనే రూపంలో ప్రశ్నలు వస్తాయని భావించవచ్ఛు ఆయా రచనల నేపథ్యం, రచనా నిర్మాణ అంశాలు కూడా ప్రశ్నలుగా రావచ్ఛు
* భారతదేశంలోని వివిధ దేవాలయాలు, వాటి నిర్మాణం వెనుకున్న నేపథ్యాలు, నిర్మించిన ప్రదేశాలు, నిర్మాణ శైలులు ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పునశ్చరణ సమయంలో... హిందూ తాత్విక చింతన- దేవాలయ నిర్మాణంపై స్థూల అవగాహనకు ప్రాధాన్యం ఇచ్చి సన్నద్ధమవడం మేలు. .
* ఎండోమెంట్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ పరీక్షలో జనరల్ స్టడీస్కు 50 మార్కులే ఉన్నాయి. ప్రస్తుత వ్యవధిలో కొత్త విషయాలపై దృష్టి పెట్టకుండా చదివిన విభాగాలనే రివిజన్ చేయడం మేలైన నిర్ణయం.
రెండు పరీక్షల్లోనూ వర్తమానాంశాలపై సులభంగా మార్కులు పొందే అవకాశం ఉంది. సాధారణంగా పరీక్ష తేదీకి ఆరు నెలల వెనక వరకు ప్రశ్నలడుగుతారు. గత మూడు నెలల వరకు జరిగిన సంఘటనలూ, అంశాలపై ఎక్కువ ప్రశ్నలు రావొచ్ఛు అందుకని ఆరు నెలల నుంచి పరీక్ష తేదీ వరకు ఉన్న సమయాన్ని ప్రామాణికంగా తీసుకుని పునశ్చరణ చేయాలి.
జూనియర్ అసిస్టెంట్స్ పరీక్ష
జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు విభాగాలకు ప్రిలిమ్స్ పరీక్షలో 50 మార్కుల ప్రాధాన్యం ఉంది. జనరల్ స్టడీస్ 100 మార్కుల్లో సీనియర్ అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధిస్తుంటారు. అయితే జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగులో అందరికీ సమమైన పోటీ అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు రివిజన్ సమయంలో భాషలపై పట్టు సాధించేందుకు మరో ప్రయత్నం చేయాలి.
* ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు తెలుగుపై కనీస అవగాహన ఉండటం లేదు. వాళ్లు ఈ విభాగంలో నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. అందువల్ల తెలుగే కదా అని నిర్లక్ష్యం చేయకుండా మెరుగ్గా సిద్ధమవడం వారి బాధ్యత.
* గ్రామీణ, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్ విభాగంలో సరైన పట్టు దొరకటం లేదు. అందువల్ల నిర్దిష్టమైన కృషితో ఈ విభాగంపై పట్టు పెంచుకునేందుకు ఇప్పుడున్న సమయంలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలి. పదో తరగతి స్థాయి అని స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి పాఠశాల స్థాయి పుస్తకాల్లోని గ్రామర్పైన ప్రధానంగా దృష్టి పెట్టాలి.
* భాషలు ప్రిపేర్ అవుతున్నప్పుడు కీలక అంశాలు అర్థమవుతున్నట్టూ, పట్టు దొరికినట్టూ అనిపిస్తుంది. కానీ ఆబ్జెక్టివ్ బిట్లు సాధన చేసినప్పుడే వాస్తవికమైన అభ్యసన స్థాయి తెలుస్తుంది. అందువల్ల రివిజన్లో అంతర్భాగంగా వీలైనన్ని బిట్లు, సబ్జెక్టు చదువుతూ ప్రాక్టీస్ చేయడం మంచిది.
* జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ తప్ప మిగతా కొత్త విభాగాలపై ఈ రివిజన్ సమయంలో దృష్టి పెట్టడం సరైన నిర్ణయం కాదు. గతంలో సిద్ధమైన విభాగాలనే పునశ్చరణ చేయాలి. అదేవిధంగా ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలను రియల్ టైంలో చేయటం ద్వారా నేర్చుకున్న స్థాయిని అంచనా వేయటమే కాదు, చేస్తున్న లోపాలూ సవరించుకోవచ్ఛు పరీక్షలకు అవసరమైన జ్ఞాపకశక్తి కూడా ఏర్పడుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM