నోటీస్‌బోర్డు

బెంగళూరులోని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన గ్యాస్‌ టర్బైన్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (జీటీఆర్‌ఈ)- అప్రెంటిస్‌ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 03 Sep 2018 01:47 IST

నోటీస్‌బోర్డు

అప్రెంటిస్‌షిప్‌
డీఆర్‌డీవో - జీటీఆర్‌ఈ   

బెంగళూరులోని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన గ్యాస్‌ టర్బైన్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (జీటీఆర్‌ఈ)- అప్రెంటిస్‌ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 150 
* విభాగాలవారీ ఖాళీలు: గ్రాడ్యుయేషన్‌- 90, డిప్లొమా-30, ఐటీఐ-30. 
* అర్హత: సంబంధిత ట్రేడులు/ బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. 
* వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ద్వారా.
* దరఖాస్తు: ఆన్‌లైన్‌. చివరి తేది: సెప్టెంబరు 14
వెబ్‌సైట్‌:  https://rac.gov.in/

అర్హత పరీక్ష
ఎన్‌హెచ్‌టెట్‌ - అక్టోబరు 2018   

నోయిడాలోని భారత టూరిజం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ)- నేషనల్‌ హాస్పిటాలిటీ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఎన్‌హెచ్‌టెట్‌) - అక్టోబరు 2018 ప్రకటన విడుదల చేసింది. కౌన్సిల్‌ అనుబంధ హాస్పిటాలిటీ విద్యా సంస్థల్లో అసిస్టెంట్‌ లెక్చరర్‌, టీచింగ్‌ అసోసియేట్‌ నియామకాలకు ఎన్‌హెచ్‌టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.  ఎన్‌హెచ్‌టెట్‌ను కౌన్సిల్‌ ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది. 
* అర్హత: ఇంటర్‌ తర్వాత హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌/ హోటల్‌  మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం లేదా హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌/ హోటల్‌  మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
* వయసు: 30 ఏళ్లు మించకూడదు. 
* పరీక్ష తేది: అక్టోబరు 6 
* దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ 
* దరఖాస్తు ఫీజు: రూ.800
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 25
* హార్డు  కాపీలను పంపడానికి చివరి తేది: సెప్టెంబరు 29
వెబ్‌సైట్‌:  http://thims.gov.in/

ప్రభుత్వ ఉద్యోగాలు
బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌  

భారత హోంమంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) ఇంజినీరింగ్‌ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* పోస్టులు-ఖాళీలు: సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌)-103,  జూనియర్‌ ఇంజినీర్‌/ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎల‌్రక్టికల్‌)-36, కానిస్టేబుల్‌-65.
* అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులు/ బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా, అనుభవం. 
* వయసు: కానిస్టేబుల్‌ పోస్టులకు  18-25 ఏళ్ల మధ్య ఉండాలి. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. 
* దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
* చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2018 సెప్టెంబరు 1-7)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌:  http://bsf.nic.in/en/recruitment.html

బార్క్‌, మైసూరు

మైసూరు (కర్ణాటక)లోని భారత అణుశక్తి విభాగానికి చెందిన బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* పోస్టులు: స్టైపెండరీ ట్రైనీ, టెక్నీషియన్‌, స్టెనో తదితరాలు. 
* ఖాళీలు: 102 అర్హత, వయసు: నిబంధనల ప్రకారం. 
* ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా.
* దరఖాస్తు: ఆన్‌లైన్‌
* చివరి తేది: సెప్టెంబరు 12 
వెబ్‌సైట్‌:  https://recruit.barc.gov.in/

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర

పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* పోస్టులు: చార్టర్డ్‌ అకౌంటెంట్‌, ట్రెజరీ డీలర్‌ తదితరాలు. 
* ఖాళీలు: 59 
* అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు ఎంబీఏ, సీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏ, ఎకనామిక్స్‌లో పీజీ, పీహెచ్‌డీ, అనుభవం. 
* ఎంపిక: గ్రూప్‌ డిష్కషన్‌, ఇంటర్వ్యూ ద్వారా.
* దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ 
* దరఖాస్తు ఫీజు: రూ.600
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 23.
* హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: అక్టోబరు 3
వెబ్‌సైట్‌:  https://www.bankofmaharashtra.in/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
సీఐఎంఏపీ, లఖ్‌నవూ

* సంస్థ: సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌    అండ్‌ ఆరోమాటిక్‌ ప్లాంట్స్‌ (సీఐఎంఏపీ), లఖ్‌నవూ.
* పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసి స్టెంట్‌, జేఆర్‌ఎఫ్‌ తదితరాలు. 
* ఖాళీలు: 49 
* అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఎస్సీ/ ఎంఫార్మసీ/ ఎంటెక్‌, నెట్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. 
* ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 11, 12. 
* వేదిక: సీఎస్‌ఐఆర్‌- సీఐఎంఏపీ ఆడిటోరియం, లఖ్‌నవూ.
వెబ్‌సైట్‌:  http://www.cimap.res.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని