డిగ్రీ మార్కులు పెంచుకోవచ్చా?
దూరవిద్య విధానంలో డిగ్రీ 44% మార్కులతో 2010లో పూర్తి చేశాను. నా మార్కుల శాతాన్ని ఓడీఈ (ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్)....
డిగ్రీ మార్కులు పెంచుకోవచ్చా?
?దూరవిద్య విధానంలో డిగ్రీ 44% మార్కులతో 2010లో పూర్తి చేశాను. నా మార్కుల శాతాన్ని ఓడీఈ (ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్) ద్వారా పెంచుకోవాలనుకుంటున్నాను. కుదురుతుందా? దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయగలరు.
జ: ఓడీఈ (ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్) ముఖ్య ఉద్దేశం- కోర్సు వ్యవధిని పూర్తిచేసుకుని కూడా టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్ కోసం వేచిచూస్తూ, వీలును బట్టి పరీక్షలను రాయాలనుకునే వారికి వీలును కల్పించడం. పరీక్ష ఫెయిల్ అయినవారు సమయం వృథా కాకుండా తిరిగి త్వరగా పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలనుకునేవారికి వీలు కల్పించే ప్రయత్నమిది. ఒకసారి కోర్సులో ఉత్తీర్ణత పొంది, సంవత్సరాలు గడిచిన తర్వాత మార్కులు పెంచుకునే మార్గం మాత్రం కాదు.
మార్కులను పెంచుకోవడానికి విద్యార్థులకు విశ్వవిద్యాలయాలు ఇంప్రూవ్మెంట్ పరీక్షల ద్వారా అవకాశం కల్పిస్తాయి. వీటిని రాసి మార్కులు పెంచుకోవాలనుకుంటే సంబంధిత విశ్వవిద్యాలయాల నిబంధనల ప్రకారం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశం డిగ్రీ పాసైన మూడేళ్లలోపు మాత్రమే (విశ్వవిద్యాలయాన్ని బట్టి) ఉంటుంది. మరిన్ని వివరాలకు ఒకసారి మీరు డిగ్రీ (దూరవిద్య) చదివిన విశ్వవిద్యాలయాన్ని సంప్రదించండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా