Kendriya Vidyalaya Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు మొదలయ్యాయ్..!
Kendriya Vidyalaya Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు మొదలయ్యాయి.
దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya vidyalayas) 2023-24 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలు మొదలయ్యాయి. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 17న రాత్రి 7గంటల వరకు కొనసాగనుంది. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయస్సు మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుందని పేర్కొంది.
కేవీల్లో సీటు కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ప్రాథమిక /వెయిటింగ్ తొలి జాబితాను ఏప్రిల్ 20న విడుదల చేసి ఏప్రిల్ 21 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు KVS ఓ ప్రకటనలో పేర్కొంది. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇకపోతే, రెండు, ఆ పైతరగతుల్లో ఖాళీగా ఉండే సీట్లను భర్తీ ప్రక్రియ ఏప్రిల్ 3న ఉదయం 8గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 12న సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుల కోసం https://kvsonlineadmission.kvs.gov.in/index.html క్లిక్ చేయండి. మొబైల్ యాప్(https://kvsonlineadmission.kvs.gov.in/apps/ ) ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఈ వివరాలు తెలుసుకోండి..
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.
- సీట్ల రిజర్వేషన్ విషయానికి వస్తే.. ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు చొప్పున కేటాయించారు.
- వయసు: ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలంటే మార్చి 31 నాటికి విద్యార్థి వయసు ఆరు నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి. రెండో తరగతి, మూడో తరగతిలో ప్రవేశానికి ఏడు నుంచి తొమ్మిదేళ్ల మధ్య, నాలుగో తరగతికి 8-10, అయిదో తరగతికి 9-11, ఆరుకు 10-12, ఏడుకు 11-13, ఎనిమిదికి 12-14, తొమ్మిదికి 13-15, పదికి 14-16 ఏళ్ల మధ్య.. ఇలా ప్రతి తరగతికీ నిర్దేశించిన మేరకు వయసు ఉండాలి.
- రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టమ్ ప్రకారం సీటును కేటాయిస్తారు.
- సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు.
- పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?