Telangana News: 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ పరీక్ష : మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  5,204 స్టాఫ్ నర్సు పోస్టులను ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 02 May 2023 20:02 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  5,204 స్టాఫ్ నర్సు పోస్టులను ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్టాఫ్ నర్సు పోస్టుల కోసం 40,936 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్ష నిర్వహించేందుకు హైదరాబాద్‌ సహా వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని పేర్కొన్న మంత్రి... అత్యంత పారదర్శకంగా, పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని