SBI PO Final Results: ఎస్‌బీఐలో 1673 పీవో పోస్టులు.. తుది ఫలితాలు వచ్చేశాయ్‌!

SBI PO mains exam results: ఎస్‌బీఐ బ్యాంకు పీవో తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కింద పీడీఎఫ్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Updated : 18 Apr 2023 21:03 IST

ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ(SBI) శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల ఉద్యోగాల (sbi po mains result) భర్తీకి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. తొలుత నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి జనవరి 30న మెయిన్స్‌ పరీక్ష నిర్వహించారు. అనంతరం ఫేజ్‌-3లో భాగంగా గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలను ఏప్రిల్‌లో నిర్వహించి షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల తుది జాబితాను సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్ అండ్‌ ప్రొమోషన్‌ విభాగం మంగళవారం ప్రకటించింది. 

గతేడాది సెప్టెంబర్‌లో ఎస్‌బీఐ ఈ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. మొత్తం 1673 పోస్టుల్లో 1600 రెగ్యులర్‌ కాగా.. 73 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను  మొత్తం మూడు దశల్లో ఎంపిక చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌ పరీక్షలను జనవరి నాటికే పూర్తి చేయగా.. మూడో దశ పరీక్షల్లో భాంగా గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలను పూర్తి చేసి తాజాగా తుది జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులు తమ రోల్‌ నంబర్‌లను ఈ పీడీఎఫ్‌లో చెక్‌ చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని