Bank Jobs: ఎస్బీఐలో 2వేల పీవో పోస్టులు.. దరఖాస్తుల గడువు పొడిగింపు
SBI PO Job Recruitment: ఎస్బీఐలో భారీగా పీవో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 3వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్బ్యాంకు(State Bank of India)లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల గడువు పొడిగించారు. సెప్టెంబర్ 27తో ఆన్లైన్ దరఖాస్తుల గడువు ముగియడంతో దాన్ని అక్టోబర్ 3వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. తాజా నిర్ణయంతో ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి ఇంకొన్ని రోజుల పాటు అవకాశం ఇచ్చినట్టయింది. మొత్తం 2వేల పీవో పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 7న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.
నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యాంశాలివే..
- మొత్తం ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు 2000 ఉండగా.. కేటగిరీల వారీగా చూస్తే ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్- 200, యూఆర్- 810 చొప్పున ఖాళీలు భర్తీ చేస్తారు.
- వేతనం: ఉద్యోగాలకు ఎంపికైన వారికి బేసిక్ పే ₹41,960 (ఇతర సౌకర్యాలు అదనం)
- వయో పరిమితి: ఏప్రిల్ 1, 2023 నాటికి 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. అదే సమయంలో 30 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్సర్వీస్మెన్ తదితరులకు ఐదేళ్లు చొప్పున వయో సడలింపు ఉంటుంది.
- ఎంపిక విధానం: బ్యాంకు పీవో ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో చేపడతారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- మెయిన్ పరీక్ష ఎన్నిసార్లు రాయొచ్చు?: జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు నాలుగు సార్లు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. జనరల్ (పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్ (పీడబ్ల్యూబీడీ) అభ్యర్థులు, ఓబీసీ, ఓబీసీ పిడబ్ల్యూబీడీ) అభ్యర్థులైతే ఏడు సార్లు రాసేందుకు ఛాన్స్ ఉంది. అదే ఎస్సీ/ఎస్సీ పీడబ్ల్యూబీడీ/ఎస్టీ/ఎస్టీపీడబ్ల్యూబీడీ) అభ్యర్థులకు ఎన్నిసార్లయినా రాయొచ్చు.
- దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
- సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 3 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
- నవంబర్లో ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష; డిసెంబర్/జనవరిలో ఆన్లైన్ మెయిన్ పరీక్ష; జనవరి/ఫిబ్రవరిలో సైకోమెట్రిక్, ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్ పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి/మార్చిలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
- తెలుగు ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: చీరాల, చిత్తూరు ,ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
- మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
జనవరి నుంచి కార్లు ప్రియం
-
ఆ ఉద్వేగం మాటల్లో చెప్పలేను: రాశీఖన్నా
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
-
Vishwak Sen: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వాయిదా.. చిత్ర బృందం అధికారిక ప్రకటన
-
WHO: ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి తప్పని వేధింపులు!
-
IPL-2024: ఐపీఎల్లో ఆడాలని ఉంది: పాకిస్థాన్ బౌలర్