UPSC CSE 2022 Results: సివిల్స్లో మెరిసిన టాప్ 10 ర్యాంకర్లకు వచ్చిన మార్కులెన్నంటే..?
UPSC CSE 2022 Result: సివిల్స్లో అమ్మాయిలు సత్తా చాటారు. తొలి నాలుగు ర్యాంకుల్లోనూ వారే మెరిశారు. నిన్న సివిల్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ.. తాజాగా విజేతల మార్కుల జాబితాను అందుబాటులో ఉంచింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలు (UPSC CSE 2022 Result) నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. తొలి నాలుగు ర్యాంకులనూ వారే సొంతం చేసుకున్నారు. ఇషితా కిశోర్ తొలి ర్యాంకులో మెరవగా.. గరిమా లోహియా, నూకల ఉమాహారతి, స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో సత్తా చాటారు. సివిల్స్లో మూడో ర్యాంకు సాధించిన ఉమా హారతి తెలంగాణ బిడ్డ కావడం విశేషం. ఆమెది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్. అలాగే, ఈసారి పరీక్షలో తెలుగు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులతో మెరిశారు. వంద లోపు ర్యాంకుల్లో 10 మంది మనవాళ్లే ఉండటం.. అలాగే, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 46మందికి పైగా అభ్యర్థులు సివిల్స్కు ఎంపిక కావడం మరో విశేషం.
ఈసారి 5.73లక్షల మంది అభ్యర్థులు సివిల్స్కు పోటీ పడగా.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలు దాటుకొని కేవలం 933మంది అభ్యర్థులే ఎంపికయ్యారు. సివిల్ సర్వీసెస్కు ఎంపికైన అభ్యర్థుల రాతపరీక్ష, ఇంటర్వ్యూలలో వచ్చిన మార్కులను UPSC తాజాగా విడుదల చేసింది. మామూలుగా రాతపరీక్షకు 1750, ఇంటర్వ్యూకు 275 మార్కుల చొప్పున మొత్తంగా 2025 మార్కులకు గాను టాప్ 10 ర్యాంకర్లు సాధించిన మార్కులను ఓసారి పరిశీలిస్తే.. సివిల్స్లో తొలి ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించిన ఇషితా కిశోర్కు రాత పరీక్షలో 901 మార్కులు; పర్సనాలిటీ టెస్టు(PT)లో 193 మార్కులు చొప్పున మొత్తంగా ఆమె 1094 మార్కులతో ఆలిండియా ఫస్ట్ ర్యాంకులో నిలిచారు. అలాగే, రెండో ర్యాంకర్ గరిమా లోహియా (ఓబీసీ) రాత పరీక్షలో 876 మార్కులు; పర్సనాలిటీ టెస్టులో 187 చొప్పున మొత్తంగా 1063 మార్కులు సాధించారు. మూడో ర్యాంకర్ ఉమా హారతి (ఓబీసీ) రాత పరీక్షలో 873, పర్సనాలిటీ టెస్టులో 187 మార్కులు చొప్పున మొత్తంగా 1060 మార్కులతో మూడో ర్యాంకుతో మెరిశారు. నాలుగో ర్యాంకర్ స్మృతి మిశ్రాకు రాత పరీక్షలో 882 మార్కులు; పర్సనాలిటీ టెస్టులో 173 మార్కుల చొప్పున మొత్తంగా 1055 మార్కులు సాధించారు.
ఇకపోతే, సివిల్స్లో ఐదో ర్యాంకు సాధించిన మయూర్ హజారికాకు రాతపరీక్షలో 861, పీటీలో 193 చొప్పున మొత్తం 1054 మార్కులు వచ్చాయి. అలాగే, ఆరో ర్యాంకర్ గెహ్నా నవ్య జేమ్స్కు రాత పరీక్షలో 861, పీటీలో 193 చొప్పున మొత్తంగా 1054 మార్కులు వచ్చాయి. ఏడో ర్యాంకర్ వసీం అహ్మద్ భట్ రాత పరీక్షలో 871, పీటీలో 182 మార్కులతో మొత్తం 1053 మార్కులు సాధించారు. ఎనిమిదో ర్యాంకర్ అనిరుధ్ యాదవ్కు రాత పరీక్షలో 856, పీటీలో 195 మార్కుల చొప్పున మొత్తంగా 1051 మార్కులు వచ్చాయి. తొమ్మిదో ర్యాంకర్ కనికా గోయల్(ఈడబ్ల్యూఎస్)కు రాత పరీక్షలో 865 మార్కులు రాగా.. పర్సనాలిటీ టెస్టు(పీటీ)లో 180 మార్కుల చొప్పున మొత్తంగా 1045 మార్కులు సాధించారు. ఇకపోతే, పదో ర్యాంకు సాధించిన రాహుల్ శ్రీవాస్తవకు రాత పరీక్షలో 863 మార్కులు రాగా.. పర్సనాలిటీ టెస్టులో 180 మార్కుల చొప్పున మొత్తంగా 1043 మార్కులు వచ్చాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్