కొవ్వు అతిగా తింటున్నారా?
అతి అనర్థదాయకం. ఆహారం విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవటం ఎంతైనా అవసరం. మనకు కొవ్వు అవసరమే. అలాగని అతిగా తినటమూ మంచిది కాదు. ఇది మితిమీరితే
అతి అనర్థదాయకం. ఆహారం విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవటం ఎంతైనా అవసరం. మనకు కొవ్వు అవసరమే. అలాగని అతిగా తినటమూ మంచిది కాదు. ఇది మితిమీరితే బరువు పెరగటం దగ్గర్నుంచి గుండెజబ్బుల వరకూ రకరకాల ముప్పులు తెచ్చిపెడుతుంది. మరి అతిగా కొవ్వు తింటున్నామని తెలుసుకోవటమెలా? తినే పదార్థాల మీద దృష్టి పెడితే చాలు కదా అనుకుంటున్నారా? ఇది నిజమే అయినా కొన్ని కొన్ని లక్షణాలను బట్టీ దీన్ని గుర్తించొచ్చు.
కడుపుబ్బరం
పీచు ఎక్కువగా ఉండే క్యాబేజీ, గోబీపువ్వు వంటివి కడుపుబ్బరం, గ్యాస్కు దారితీస్తాయన్నది తెలిసిందే. ఇవే కాదు, కొవ్వు పదార్థాలు మరీ ఎక్కువగా తిన్నా కూడా కడుపు ఉబ్బుతుంది. కొవ్వులు త్వరగా జీర్ణం కావు. పొట్టలో చాలాసేపు పులిసిపోయే స్థితిలో ఉంటాయి. దీంతో తేన్పులు, కడుపుబ్బరం వంటి ఇబ్బందులు వేధిస్తాయి.
విరేచనాలు
కొవ్వు పదార్థాలు అతిగా తింటే విరేచనాలు కూడా పట్టుకోవచ్చు. కొందరి శరీరం కొవ్వు పదార్థాలను సరిగా శోషించుకోలేదు. ఇలా కొవ్వులు అరకొరగా జీర్ణమైతే చిన్నపేగులు, పెద్దపేగు మరింత ఎక్కువగా నీటిని విడుదల చేస్తాయి. ఫలితంగా నీళ్ల విరేచనాలు పట్టుకుంటాయి.
నిద్రకు భంగం
కొవ్వు పదార్థాలు పగటిపూట హుషారు తగ్గేలా చేయటమే కాదు, రాత్రిపూట నిద్ర సరిగా పట్టకుండానూ చేస్తాయి. కొవ్వులు జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి శరీరం విశ్రాంతి తీసుకోవటంలోనూ అడ్డుతగులుతాయి. ఇలా రాత్రిపూట నిద్ర సరిగా పట్టకపోవటం వల్ల మర్నాడూ నిద్రమత్తుగా అనిపిస్తుంది.
అలసట, మందకొడితనం
మరీ ఎక్కువగా కొవ్వు పదార్థాలు తింటే అలసట, మందకొడితనం ఆవహిస్తాయి. దీనికి కారణం కొవ్వు పదార్థాలతో పేగుల్లో పుట్టుకొచ్చే కొన్నిరకాల హార్మోన్లే. ఇవి మెదడు నెమ్మదిగా స్పందించేలా చేస్తాయి. ఫలితంగా హుషారు తగ్గుతుంది.
అధిక బరువు
కొవ్వు పదార్థాలు తినే సమయంలో డొపమైన్, సెరటోనిన్ వంటి నాడీ సమాచార వాహక రసాయనాలు పెరుగుతాయి. ఇవి సంతోషం, ఆనందం కలిగించేవి కావటం వల్ల మరింత ఎక్కువ తినేలా చేస్తాయి. ఇది బరువు పెరగటానికి దారితీస్తుంది. కొందరు బరువు తగ్గటానికి అధిక కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారమూ తీసుకుంటుంటారు. అయితే కొవ్వు మోతాదులు సరైన పాళ్లలో లేకపోతే బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు