చేపలు ‘మంచి’వైతేనే..
చేపలు-మధుమేహం ముప్పు మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తుండటం కొత్తేమీ కాదు. కొన్ని అధ్యయనాలు చేపలతో మధుమేహం ముప్పు తగ్గుతుందని చెబుతుంటే.. అసలు అలాంటి ప్రయోజనమేమీ ఉండదని, పైగా ముప్పు పెరుగుతుందనీ మరికొన్ని వివరిస్తున్నాయి. ఇలాంటి భిన్న ఫలితాలు ఎందుకు వస్తున్నాయి? తాజా స్వీడన్ అధ్యయనం ఒకటి దీని మీదే దృష్టి సారించింది. చేపలు తినే 842 మందిని ఏడేళ్ల పాటు పరిశీలించగా.. వీరిలో సగం మంది మధుమేహం బారినపడ్డట్టు తేలింది. అంటే సగం మందికే ముప్పు తగ్గిందన్నమాట. ఫలితాలను లోతుగా విశ్లేషించగా కాలుష్య కారకాలు ఇందులో పాలు పంచుకుంటున్నట్టు బయటపడింది. కొవ్వు ఎక్కువగా ఉండే సాల్మన్ వంటి చేపలు తిన్నవారి రక్తంలో పర్యావరణాన్ని కలుషితం చేసే కారకాలూ పెద్దమొత్తంలో ఉంటున్నట్టు తేలింది. ముఖ్యంగా డీడీటీ, పీసీబీ కాలుష్య కారకాలు చేపల్లో ఎక్కువగా ఉండటమే దీనికి కారణమన్నది శాస్త్రవేత్తల భావన. డీడీటీ, పీసీబీ రెండూ మధుమేహం ముప్పు పెరగటానికి దోహదం చేస్తున్నట్టు గతంలోనే వెల్లడి కావటం గుర్తించాల్సిన విషయం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: స్పిన్ ఎదుర్కోవడం కోహ్లీకి కాస్త కష్టమే.. కింగ్కు మాజీ ఆటగాడి సూచన ఇదే..!
-
India News
అలా చేస్తే.. 2030 కల్లా భారత్ దివాలా తీయడం ఖాయం: హరియాణా సీఎం కీలక వ్యాఖ్యలు
-
World News
Chinese spy balloon: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్..!
-
Politics News
Kotamreddy: అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి
-
India News
Air India Express: గగనతలంలో ఇంజిన్లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!