మొటిమలకూ ఆవిరి మంత్రం

మొటిమలతో బాధపడుతున్నారా? అయితే ముఖానికి ఆవిరి పట్టి చూడండి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

Updated : 03 Aug 2021 06:17 IST

మొటిమలతో బాధపడుతున్నారా? అయితే ముఖానికి ఆవిరి పట్టి చూడండి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత గిన్నెలో గుప్పెడు యూకలిప్టస్‌ ఆకులను తీసుకొని, వాటిపై మరుగుతున్న నీటిని పోయాలి. తల మీది నుంచి తువ్వాలు కప్పుకొని 10-15 నిమిషాల సేపు ముఖానికి ఆవిరి పట్టించాలి. ఇది చర్మ రంధ్రాలు తెరచుకునేలా చేస్తుంది. దీంతో చర్మ రంధ్రాల్లో అడ్డంకులేవైనా ఉంటే బయటకు వస్తాయి. మొటిమలు చీము పట్టటానికి దారితీసే నూనె, మృత చర్మకణాలు సైతం బయటకు వచ్చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని