తక్కువ జీఐ పదార్థాలతో శరీర సౌష్టవం మెరుగు!
శరీర సౌష్టవం బాగుండాలని అనుకుంటున్నారా? అయితే ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్థాలు తిని చూడండి. గుండెజబ్బులు గలవారికిది మరింత బాగా ఉపయోగపడుతుండటం గమనార్హం. మనం తీసుకునే పిండి పదార్థాల్లోని గ్లూకోజు ఎంత వేగంగా
శరీర సౌష్టవం బాగుండాలని అనుకుంటున్నారా? అయితే ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్థాలు తిని చూడండి. గుండెజబ్బులు గలవారికిది మరింత బాగా ఉపయోగపడుతుండటం గమనార్హం. మనం తీసుకునే పిండి పదార్థాల్లోని గ్లూకోజు ఎంత వేగంగా రక్తంలో కలుస్తుందనే దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్(జీఐ)తో లెక్కిస్తుంటారు. అన్నం, తెల్ల బ్రెడ్డు, బంగాళా దుంపలు, మిఠాయిల వంటివి అధిక జీఐ పదార్థాలు. ఇవి రక్తంలో గ్లూకోజు చాలా త్వరగా పెరిగేలా చేస్తాయి. యాపిల్, నారింజ, బ్రకోలీ, ఆకు కూరల వంటి పండ్లు, కూరగాయలు.. దంపుడు బియ్యం వంటి పొట్టుతీయని ధాన్యాలు, పప్పుల వంటివన్నీ తక్కువ జీఐ పదార్థాలు. ఇవి నెమ్మదిగా రక్తంలో గ్లూకోజును పెంచుతాయి. మాంసం, చికెన్, చేపల్లో ఎలాంటి పిండి పదార్థాలు ఉండవు. రక్తంలో త్వరగా గ్లూకోజును పెంచే పదార్థాలతో గుండెజబ్బులు, మధుమేహం వంటి జబ్బుల ముప్పు పెరిగే ప్రమాదముంది. అందుకే ఆలస్యంగా జీర్ణమవుతూ, రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలిసేలా చేసే పదార్థాలు తినటం మంచిదని నిపుణులు చాలాకాలంగా సూచిస్తున్నారు. గుండెజబ్బులు గలవారిలో వీటి ప్రభావాన్ని తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. ప్రొటీన్, కొవ్వు పదార్థాలను ఎప్పటిలాగానే కొనసాగిస్తూ తక్కువ జీఐ పదార్థాలను తీసుకున్నవారిలో శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ), నడుం చుట్టుకొలత గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. మహిళల్లో కన్నా పురుషుల్లో నడుం చుట్టుకొలత, తుంటి చుట్టుకొలత, నడుం-తుంటి నిష్పత్తి ఇంకాస్త ఎక్కువగా తగ్గినట్టూ తేలింది. ఇది గుండెజబ్బులు గలవారికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్