Brushing Habits: భోజనం చేసిన వెంటనే బ్రష్‌ చేయాలా?

భోజనమయ్యాక పళ్లు తోముకోవాలని (Brushing Teeth) చెబుతుంటారు. అయితే నిజంగానే బ్రష్‌ చేయాలా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Updated : 23 Jul 2023 16:50 IST

భోజనం చేశాక బ్రష్‌తో పళ్లు తోముకోవటం (Brushing Teeth) ఎంతైనా అవసరం. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే రొట్టెలు, అన్నం వంటివి నోట్లో బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. ఇది పళ్లకు రక్షణగా నిలిచే తెల్లటి పొరను (Enamel) దెబ్బతీస్తుంది. బ్రష్‌తో తోముకుంటే ఈ బ్యాక్టీరియా పెరగకుండా నివారించుకోవచ్చు. అయితే కొన్నిసార్లు భోజనం చేసిన వెంటనే తోముకోవటమూ మంచిది కాకపోవచ్చు. ముఖ్యంగా పుల్లటి పదార్థాలు తిన్నాక 30 నిమిషాల తర్వాతే తోముకోవటం మేలు.

పుల్లటి పదార్థాల్లోని ఆమ్లం ఎనామిల్‌ పొరను బలహీన పరుస్తుంది. అందువల్ల వీటిని తిన్న వెంటనే పళ్లు తోముకుంటే ఎనామిల్‌ దెబ్బతినే ప్రమాదముంది. ఒకసారి ఎనామిల్‌ పోతే అంతే. తిరిగి పెరగదు. పుల్లటి పదార్థాలు తినటానికి ముందే పళ్లు తోముకొని, తర్వాత నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. దీంతో పళ్ల మీద ఆమ్లం ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని