ఎక్కడ చూసినా ఎడప్పాడి సేవకులే
అన్నాడీఎంకే ప్రచారకర్తగా ఉన్న మరుదు అళగురాజ్ ఇటీవల నమదు అమ్మ పత్రిక ఎడిటర్ పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..
మరుదు అళగురాజ్
సైదాపేట, న్యూస్టుడే: అన్నాడీఎంకే ప్రచారకర్తగా ఉన్న మరుదు అళగురాజ్ ఇటీవల నమదు అమ్మ పత్రిక ఎడిటర్ పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఓపీఎస్, ఈపీఎస్లు పార్టీని విజయవంతంగా నడిపిస్తారనే నమ్మకం కోల్పోవడంతో నమదు అమ్మ ఎడిటర్ పదవి నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నారు. పార్టీ చీలిక మార్గంలో వెళ్లడానికి ఎవరు కారణమనేది తెలుసన్నారు. సర్వసభ్య సమావేశ తీర్మానాలు తయారుచేసే కమిటీలో తాను కూడా ఉన్నానని, వాటిని ఖరారు చేసి ఓపీఎస్, ఈపీఎస్లకు పంపామని అన్నారు. 23న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎక్కడ చూసినా పళనిస్వామి సేవకులను నిల్చోపెట్టారని పేర్కొన్నారు. పన్నీర్సెల్వం, ఆయన వర్గీయులు లోపలికి వచ్చేటప్పుడు నిర్వాహకులకు వెనుక కూర్చున్న కొందరు అసభ్యపదజాలంతో దూషించారని తెలిపారు. అరగంటలో సమావేశం ముగిసిందంటే అది ఎలా జరిగిందో తెలుస్తోందని పేర్కొన్నారు. కావాలనే ఓపీఎస్ను అవమానించారని అన్నారు. దీన్ని వేదికపై ఉన్న ఎడప్పాడి చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. ఎప్పటికీ సర్వసభ్య సభ్యులు, కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయటం కుదరదని, ఇది అన్నాడీఎంకేలో నిబంధన అని తెలిపారు. ప్రస్తుతం డబ్బుతో ఎంతమంది సర్వసభ్య సభ్యులనైనా కొనొచ్చని పేర్కొన్నారు. సమావేశంలో అన్ని తీర్మానాలు నిరాకరిస్తున్నట్లు చెప్పడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. అలాగైతే జయలలితకు భారతరత్న ఇవ్వాలని కోరిన తీర్మానం కూడా రద్దు అవుతుందా? అని ప్రశ్నించారు. కూవత్తూరులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే స్థోమత ఎడప్పాడి పళనిస్వామికి ఉండడంతో సెంగోట్టయ్యన్ ముఖ్యమంత్రి కాలేకపోయారని అన్నారు. అదే తరహాలో ఎడప్పాడి ప్రస్తుతం సర్వసభ్య సభ్యులను కూడా లోబర్చుకున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ