logo

నిజాయతీ చాటిన బాలిక

పల్లడంలో రోడ్డుపై పడి ఉన్న రూ.40 వేల నగదును పోలీసు స్టేషనులో అప్పగించి నిజాయతీ చాటుకుంది ఓ బాలిక. తిరుప్పూర్‌ జిల్లా పల్లడం పచ్చపాళ్యానికి చెందిన యువరాజ్‌- నిత్యలక్ష్మి దంపతులు.

Updated : 05 Jul 2022 06:35 IST


దర్శినికి బహుమతి అందిస్తున్న ఎస్సై

వేలచ్చేరి, న్యూస్‌టుడే: పల్లడంలో రోడ్డుపై పడి ఉన్న రూ.40 వేల నగదును పోలీసు స్టేషనులో అప్పగించి నిజాయతీ చాటుకుంది ఓ బాలిక. తిరుప్పూర్‌ జిల్లా పల్లడం పచ్చపాళ్యానికి చెందిన యువరాజ్‌- నిత్యలక్ష్మి దంపతులు. వీరి కుమార్తె దర్శిని (13) పల్లడంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఆదివారం నిత్యలక్ష్మి తన కుమార్తెతో కలిసి వస్త్రాలు కొనుగోలు చేయడానికి దుకాణానికి వెళ్తుండగా దర్శినికి రోడ్డుపై రూ.40 వేల నగదు కట్ట కనిపించింది. వాటిని తీసుకున్న ఆమె పోలీసు స్టేషనుకు వెళ్లి అప్పగించింది. దీంతో ఎస్సై బాలికను అభినందించి బహుమతి అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని