స్మార్ట్ రాష్ట్రమే సర్కారు లక్ష్యం: ముఖ్యమంత్రి
తమిళనాడును స్మార్ట్ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ తరఫున ‘ముదలీట్టాళర్ ముదల్ ముగవరి-తమిళనాడు’ (పెట్టుబడిదారుల తొలి చిరునామా-తమిళనాడు) పేరుతో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో సోమవారం సదస్సు జరిగింది.
సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దృశ్యం
చెన్నై, న్యూస్టుడే: తమిళనాడును స్మార్ట్ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ తరఫున ‘ముదలీట్టాళర్ ముదల్ ముగవరి-తమిళనాడు’ (పెట్టుబడిదారుల తొలి చిరునామా-తమిళనాడు) పేరుతో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో సోమవారం సదస్సు జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో రూ.1,25,244 కోట్ల పెట్టుబడులతో 60 ప్రాజెక్టులకు అవగాహన ఒప్పందాలు జరిగాయి. సదస్సులో స్టాలిన్ మాట్లాడుతూ... పరిశ్రమల స్థాపనకు తగిన ఉత్తమ రాష్ట్రాల్లో తమిళనాడు మూడో స్థానాన్ని పొందడం చరిత్రాత్మక విజయమన్నారు. 13వ స్థానం నుంచి ఈ స్థానానికి చేరామని, డీఎంకే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇది సాధ్యమైందని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రిగా తంగం తెన్నరసును ఎంపిక చేసిన నమ్మకాన్ని ఆయన నిలబెట్టారని అభినందించారు. ఆరోసారి డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సదస్సులు నిర్వహించిందని తెలిపారు. ప్రపంచ నలుమూలలకు రాష్ట్ర ఉత్పత్తులు చేరాలన్నదే ఈ సదస్సు లక్ష్యాల్లో ఒకటన్నారు. ప్రభుత్వంపై అపార నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం హర్షణీయమని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన సహాయ, సహకారాలు అందించడానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సాంకేతిక సేవలను ఒకే గొడుగు కింద అందించడానికి అనువుగా టీఎన్- టెక్ఎక్స్పీరియన్స్ ప్రాజెక్టు వెబ్సైట్ను ప్రారంభించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అంకుర సంస్థలకు ఓ ప్లాట్ఫారం ఏర్పాటు చేసేలా టీఎన్ పీట్చ్ఫెస్ట్నూ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ప్రపంచానికి ఓ ఉదాహరణగా ఉండేలా తమిళనాడును స్మార్ట్ రాష్ట్రంగా మార్చడమే సర్కారు లక్ష్యమని వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి మార్గాలనూ రూపొందించుకుంటేనే పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రత్యేకత చూపగలమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.2.20 లక్షల కోట్ల విలువైన 192 అవగాహన ఒప్పందాలు ప్రభుత్వం కుదుర్చుకుందని పేర్కొన్నారు. సదస్సులో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి తంగం తెన్నరసు, ఆ శాఖ అదనపు ప్రధానకార్యదర్శి కృష్ణన్, మార్గదర్శక సంస్థ ఎండీ, సీఈవో పూజా కులకర్ణి, అమెరికా కాన్సుల్ జనరల్ జుడిత్ రవిన్, టాటా పవర్ ఎండీ, సీఈవో ప్రవీణ్ సిన్హా, ఏసీఎంఈ గ్రూపు వ్యవస్థాపకుడు, ఎండీ మనోజ్కుమార్ ఉపాధ్యాయ్, పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన దౌత్యాధికారులు పాల్గొన్నారు.
టాన్సిమ్, ఎంఎస్ఎంఈలకు అభినందనలు
చెన్నై, న్యూస్టుడే: రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్-2021లో అగ్రస్థానం పొందినందుకు తమిళనాడు స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ మిషన్ (టాన్సిమ్), సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లకు ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అందులో... రాష్ట్ర స్టార్టప్ ఛాంపియన్ పురస్కారం పొందినందుకు ఐఏఎస్ అధికారులు ఎస్.నాగరాజన్, సజీవనలకు అభినందనలు తెలిపారు. అంకుర పరిస్థితులు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో భవిష్యత్తులోనూ ఉత్తమ ప్రదర్శన కొనసాగుతుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.
శ్రీలంక చెర నుంచి జాలర్లను విడిపించాలని లేఖ
చెన్నై, న్యూస్టుడే: శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన తమిళ జాలర్లను విడిపించాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్కు ఓ లేఖ రాశారు. అందులో... 61 రోజుల నిషేధకాలం ముగిసి జూన్ 15న చేపల వేట ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో 12 మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిందని తెలిపారు. వారిని విడిపించడానికి త్వరగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రానికి చెందిన ఏడుగురు, పుదుచ్చేరికి చెందిన ఐదుగురు జాలర్లు ఆదివారం అరెస్టు అయిన వారిలో ఉన్నారు.
ఉదయనిధి కృతజ్ఞతలు
చెన్నై, న్యూస్టుడే: డీఎంకే యువజన విభాగ కార్యదర్శిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ అధ్యక్షుడైన స్టాలిన్కు ఆయన తనయుడు ఉదయనిధి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. అందులో... బాధ్యతాయుతమైన పదవిలో నాలుగో ఏడాది ప్రయాణం ప్రారంభించానని తెలిపారు. నమ్మకంతో గురుతర బాధ్యత అప్పగించిన పార్టీ అధ్యక్షుడు స్టాలిన్, ప్రధానకార్యదర్శి దురైమురుగన్ తదితరులకు కృతజ్ఞతలని పేర్కొన్నారు. తనతో పాటు కృషి చేస్తున్న యువజన విభాగం, తనను ఆదరిస్తున్న ప్రజలకూ కృతజ్ఞతలని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!