కఠిన నిబంధనలు సాధ్యం కాదు
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నివారణకు కఠిన నిబంధనలు విధించే పరిస్థితి లేదని ఆరోగ్య శాఖ మంత్రి మా.సుబ్రమణియన్ పేర్కొన్నారు. చెంగల్పట్టు జిల్లా ఇడైక్కళినాడు పట్టణ పంచాయతీలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సోమవారం పరిశీలించారు.
ఆరోగ్యశాఖ మంత్రి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశీలిస్తున్న మా.సుబ్రమణియన్
మహాబలిపురం, న్యూస్టుడే: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నివారణకు కఠిన నిబంధనలు విధించే పరిస్థితి లేదని ఆరోగ్య శాఖ మంత్రి మా.సుబ్రమణియన్ పేర్కొన్నారు. చెంగల్పట్టు జిల్లా ఇడైక్కళినాడు పట్టణ పంచాయతీలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ... పలు దేశాల్లో కరోనావిజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆదివారం నాటికి 14,504 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఆర్థికంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కఠిన నిబంధనలను సీఎం అమలు చేయడం లేదని చెప్పారు. బాధితులకు తగిన చికిత్స అందించడానికి అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బాధితుల్లో 95 శాతం మంది ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారని వివరించారు.
15 వేలు దాటిన యాక్టివ్ కేసులు
చెన్నై, న్యూస్టుడే: రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో సోమవారం 2,654 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చెన్నైలో 1,066 కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 34,85,429కి చేరింది. బాధితుల్లో కొత్తగా ఎవరూ మరణించలేదు. మొత్తం మరణాల సంఖ్య 38,026గానే ఉంది. రోజు వ్యవధిలో కొత్తగా 1,542 మంది డిశ్చార్జి అయ్యారు. కోలుకున్నవారి మొత్తం సంఖ్య 34,31,787కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 15,616కు పెరిగింది. పుదుచ్చేరిలో 24గంటల వ్యవధిలో కొత్తగా 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు నమోదుకాలేదు. యాక్టివ్ కేసుల సంఖ్య 501కి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్