చెన్నైలో ‘రోప్కార్’కు సన్నాహాలు
చెన్నై పర్యాటకులను ఆకర్షించేవిధంగా సింగార చెన్నై 2.0 పథకం ద్వారా నగరంలో రోప్కార్ సేవను ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు సమాచారం వెల్లడైంది. చెన్నై కార్పొరేషన్ తరఫున గ్రీన్ చెన్నై, కల్చరల్ చెన్నై, క్లీన్ చెన్నై, హెల్తీ చెన్నై, ఎడ్యుకేషనల్ చెన్నై తదితర పలు పనులు నిర్వహిస్తున్నారు.
రోప్కార్ నమూనా
ఆర్కేనగర్, న్యూస్టుడే: చెన్నై పర్యాటకులను ఆకర్షించేవిధంగా సింగార చెన్నై 2.0 పథకం ద్వారా నగరంలో రోప్కార్ సేవను ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు సమాచారం వెల్లడైంది. చెన్నై కార్పొరేషన్ తరఫున గ్రీన్ చెన్నై, కల్చరల్ చెన్నై, క్లీన్ చెన్నై, హెల్తీ చెన్నై, ఎడ్యుకేషనల్ చెన్నై తదితర పలు పనులు నిర్వహిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేవిధంగా భారీ రంగులరాట్నాలతో కూడిన ఉద్యానాల ఏర్పాటు, సముద్రతీర రహదారుల సుందరీకరణ వంటి పనులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చెన్నై మెరినా సముద్రతీరం తదితర కొన్ని ప్రాంతాలలో రోప్కార్ వసతిని ప్రారంభించేందుకు నిర్ణయించారని తెలిసింది. ఇటీవల మున్సిపాలిటీ నిర్వహణశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ మాట్లాడుతూ.. సింగార చెన్నై 2.0 పథకంలో నగరాన్ని సుందరీకరించేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. అనేకమంది కౌన్సిలర్లు స్పందించారు. రోప్కార్ వసతిని ప్రారంభించవచ్చని కొందరు చెప్పారు.
నేప్పియార్ వంతెన
సముద్రతీరంలో.. చెన్నైలో ముఖ్య పర్యాటక ప్రదేశంగా ఉన్న మెరినా బీచ్లో రోప్కార్ సేవలను ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం వెల్లడైంది. చెన్నై కార్పొరేషన్కు చెందిన అధికారులు, ఇంజినీర్లు పలు కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతగా నేప్పియార్ వంతెన నుంచి నమ్మ చెన్నై సెల్ఫీ పాయింట్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ప్రారంభించే అవకాశాలున్నాయి. తర్వాత రాయపురం రైల్వేస్టేషన్ నుంచి నేప్పియార్ వంతెన వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సింగార చెన్నై 2.0 పథకానికిగాను తీసుకుంటున్న నిర్ణయాలు, కొత్త పథకాలు త్వరలో అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు సమాచారం.
నమ్మ చెన్నై పాయింట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
[ 28-03-2024]
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని దక్షిణ చెన్నై భాజపా అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కోయంబేడు శివాలయం నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. -
రాష్ట్రంలో అగ్రనేతల సుడిగాలి ప్రచారం
[ 28-03-2024]
నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కమిషన్ నుంచి అభ్యర్థుల అధికారిక ప్రకటనే మిగిలింది. వాటిని పట్టించుకోకుండా ముందే ప్రచారాన్ని మొదలుపెట్టాయి కూటమి పార్టీలు. తమ అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు. -
మెట్రో రెండోదశ మార్గంలో వసతుల కల్పనకు కసరత్తు
[ 28-03-2024]
మెట్రో రెండో దశ పనులు నగరంలో మూడు ప్రాంతాల నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. ప్రయాణికులకు చక్కటి సేవలతో పాటు వసతుల కల్పనకు సీఎంఆర్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. -
తిరువణ్ణామలైలో విజయ పతాకమెవరిది?
[ 28-03-2024]
తిరువణ్ణామలై ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. పంచభూత లింగాల్లో అగ్నిలింగం ఇక్కడి ఉన్నాములై సమేత అరుణాచలేశ్వర్ ఆలయంలో ఉంది. ఆలయం సుమారు 1100 ఏళ్ల కిందట నిర్మితమైంది. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. -
చేజారిన సెంటిమెంట్ స్థానం
[ 28-03-2024]
దిండుక్కల్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఇద్దరు ఉన్నా.. వారిని పక్కన పెట్టేసి ఎస్డీపీఐకు టికెట్ కేటాయించడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ అవకాశం ఇస్తారని నమ్ముతున్నా
[ 28-03-2024]
మధ్య చెన్నై నియోజకవర్గ ప్రజలు మళ్లీ తనకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నట్లు డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నామపత్రాన్ని షెనాయ్నగర్లోని కార్పొరేషన్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సమర్పించారు. -
నామినేషన్ దాఖలు చేసిన అన్నామలై
[ 28-03-2024]
భాజపా తరపున కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
వేరే చిహ్నంతో పోటీ: దురైవైగో
[ 28-03-2024]
బొంగరం గుర్తు దొరక్కపోతే వేరే చిహ్నంతో పోటీ చేస్తామని తిరుచ్చి ఎండీఎంకే అభ్యర్థి దురైవైగో అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. గుర్తు కేటాయింపున వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. -
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్
[ 28-03-2024]
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని పీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వ్యవస్థాపకుడు రామదాస్ బుధవారం చెన్నై టీనగర్లోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. -
పార్టీలు కొత్త గుర్తులతో పోటీ చేయాలి: సీమాన్
[ 28-03-2024]
నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కి జాతీయ మృగమైన పులిని తమ ఎన్నికల గుర్తుగా కేటాయించాలని కోరనున్నామని ఆ పార్టీ చీఫ్ కన్వీనర్ సీమాన్ తెలిపారు. చెన్నై ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. -
చెన్నై సహా ఐదుచోట్ల ఎన్ఐఏ సోదాలు
[ 28-03-2024]
బెంగళూరులో బాంబు దాడి వ్యవహారమై రాష్ట్రంలో ఐదుచోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులు చెన్నై ట్రిప్లికేన్లో నెల రోజులకి పైగా ఉండి కుట్ర పన్నిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్