‘హిమాలయాలు’ కరుగుతున్నాయి!

హిమాలయ పర్వతాలు తెలుసు కదా.. అక్కడ సాధారణం కన్నా ఎక్కువగా మంచు కరుగుతోందంట. ఏటా 5 బిలియన్ల దుమ్ము కణాలు కొత్తగా భూమి మీదకు చేరుతున్నాయంట. అవి హిమాలయాల్లోని మంచును కరిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

Published : 11 Oct 2020 01:14 IST

హిమాలయ పర్వతాలు తెలుసు కదా.. అక్కడ సాధారణం కన్నా ఎక్కువగా మంచు కరుగుతోందంట. ఏటా 5 బిలియన్ల దుమ్ము కణాలు కొత్తగా భూమి మీదకు చేరుతున్నాయంట. అవి హిమాలయాల్లోని మంచును కరిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఎడారి దేశాల నుంచి శీతల పవనాల ద్వారా దుమ్ము హిమాలయాల ఉత్తర భాగంలో కేంద్రీకృతం అవుతూ.. అక్కడి గాలిని కలుషితం చేస్తోందంట. పరిశ్రమలు పెరగడం, వాతావరణ మార్పులతో సాధారణం కన్నా ఎక్కువగా దుమ్ము విడుదల అవుతోంది. దుమ్ము, వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం.. ఈ మూడు అంశాలు రాబోయే రోజుల్లో దాదాపు వంద కోట్ల మందికి నీటి ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందంట.  పచ్చదనం పెంచి.. కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించాలని నిపుణులు చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని