మనలా వేరే జీవులకూ జ్వరం వస్తుందా?
మనుషులకు జ్వరం ఎందుకు వస్తుంది? మనుషులకు వచ్చినట్లే ఇతర జీవులకూ....
ప్రశ్న: మనుషులకు జ్వరం ఎందుకు వస్తుంది? మనుషులకు వచ్చినట్లే ఇతర జీవులకూ జ్వరం వస్తుందా?
- కె.సాయి శ్రీరామశరన్, 9వ తరగతి, పరంజ్యోతి స్కూల్, అమలాపురం
మనుషులకు జ్వరం రావడానికి కారణం... వారి రక్తంలో పైరోజన్స్ అనే రసాయనాలు ప్రవహిస్తూ మెదడులోని హైపోథాలమస్ను జేరతాయి. శరీర ఉష్ణోగ్రతను హైపోథాలమస్ అదుపు చేస్తూ ఉంటుంది. ఈ పైరోజన్స్ హైపోథాలమస్లోని కొన్ని గ్రాహకాలతో బంధం ఏర్పర్చుకోవడంతో, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇదే జ్వరం.
* శరీరంలో రోగం, అనారోగ్యం లేదా మరే ఇతర కారణాలు ఏర్పడినప్పుడు ప్రతిస్పందనగా హైపోథాలమస్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.
* సాధారణంగా జలుబు, అతిసారవ్యాధి లేదా చెవి, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు, బ్లాడర్, మూత్రపిండాలు ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు జ్వరం వస్తుంది.
* జ్వరం రావడం వల్ల రోగనిరోధక కణాలు రక్తనాళాల గోడల వెంబడి పాకి అనారోగ్యం కల్గజేసే సూక్ష్మజీవులతో పోరాటం చేస్తాయి.
* జ్వరం రోగం కాదు. జ్వరం రావడం వల్ల శరీరంలో ప్రవేశించిన బ్యాక్టీరియా, వైరస్లను రోగనిరోధక కణాలు చంపగల్గుతాయి.
* పిల్లలకు పాలిచ్చే జంతువులన్నింటికి జ్వరం వస్తుంది. శీతల రక్త జంతువులకు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటి శరీర ఉష్ణోగ్రత పెంచుకునేందుకు అవి వేడి ప్రాంతాలకు వెడతాయి. చేపలు, బల్లులు ఈ విధంగా చేస్తాయి.
* చిలుకలకు జ్వరం రావడం చాలా అరుదైన విషయం. చాల్మైడిక్ సిటాసి అనే ఒక ప్రత్యేక తరహ బ్యాక్టీరియా వల్ల చిలుకలకు జ్వరం వస్తుంది. చిలుకల జ్వరం అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు దేశాల్లో వచ్చినట్లు ఆ దేశాలుతెలియజేశాయి.
- డాక్టర్ సి.వి.సర్వేశ్వరశర్మ, ప్రెసిడెంట్, కోనసీమ సైన్స్ పరిషత్, అమలాపురం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ