స్వర్గానికి ఇది నమూనా!

మారిషస్‌... ఆఫ్రికా ఖండతీర ప్రాంతంలో హిందూ మహాసముద్రంలో ఉండే ఓ ద్వీప దేశం. లక్షల ఏళ్ల క్రితం భూగర్భంలోని అగ్నిపర్వతాల విస్ఫోటనాల వల్ల ఈ ద్వీపం ఏర్పడింది. మొదటిసారిగా ఇక్కడ అడుగుపెట్టింది పోర్చుగీసులు. ఈ దేశంలో మారిషస్‌ క్రియోల్‌, ఫ్రెంచ్‌, భోజ్‌పురీ, ఆంగ్లం, హిందీలతో పాటు మన తెలుగు కూడా మాట్లాడతారు. ఇక్కడ భారత్‌, ఆఫ్రికా,చైనా దేశాల సంతతివారు ఎక్కువగా ఉంటారు.

Published : 22 Jan 2017 01:02 IST


స్వర్గానికి ఇది నమూనా!

* మారిషస్‌... ఆఫ్రికా ఖండతీర ప్రాంతంలో హిందూ మహాసముద్రంలో ఉండే ఓ ద్వీప దేశం.
* లక్షల ఏళ్ల క్రితం భూగర్భంలోని అగ్నిపర్వతాల విస్ఫోటనాల వల్ల ఈ ద్వీపం ఏర్పడింది. మొదటిసారిగా ఇక్కడ అడుగుపెట్టింది పోర్చుగీసులు.
* ఈ దేశంలో మారిషస్‌ క్రియోల్‌, ఫ్రెంచ్‌, భోజ్‌పురీ, ఆంగ్లం, హిందీలతో పాటు మన తెలుగు కూడా మాట్లాడతారు. ఇక్కడ భారత్‌, ఆఫ్రికా,చైనా దేశాల సంతతివారు ఎక్కువగా ఉంటారు.


* ఇప్పుడు అంతరించి పోయిన డోడో అనే పక్షులు ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే ఉండేవి.

* 1968లో బ్రిటన్‌ నుంచి స్వతంత్రం పొందిందిది.
* ఈ ద్వీప దేశాన్ని చూడ్డానికి దేశదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ప్రముఖ రచయిత మార్క్‌ ట్వైన్‌ ఈ దేశం గురించి ఏమన్నారో తెలుసా? ‘ముందు మారిషస్‌ ఏర్పడింది ఆ తర్వాతే స్వర్గం తయారైంది. మారిషస్‌ను చూసే స్వర్గాన్ని తీర్చిదిద్దారు’. ఎంత అందమైన దేశమో కదా.


* ఇక్కడ ముఖ్యమైన పర్యటక ప్రాంతం ఛామరెల్‌లోని ‘ఏడు రంగుల నేల’. తక్కువ ప్రదేశంలోని ఇక్కడి ఇసుక వేరువేరు రంగుల్లో భలేగా కనిపిస్తుంది. ఇది అగ్నిపర్వతాల ప్రభావంతోనే ఏర్పడింది.
* ఈ ఐలాండ్‌లో క్రూరమృగాలు ఉండవు. ఇక్కడ కనిపించే పాములు కూడా విషపూరితమైనవి కావు.
* ఈ ద్వీపం చుట్టూ ఉండే కోరల్‌ రీఫ్స్‌ ఉష్ణోగ్రతల నుంచి, షార్కు, జెల్లీఫిష్‌ వంటి జలచరాల నుంచి సందర్శకుల్ని కాపాడుతుంటాయి.
* దేశం మొత్తం జనాభాలో రాజధాని పోర్ట్‌ లూయిస్‌లోనే 40 శాతం మంది నివసిస్తారు.
* మారిషస్‌ అనే పేరు ఒకప్పటి రాజకుమారుడు మారిస్‌ డె నాసో పేరు మీదుగా వచ్చింది.


* ఇక్కడి మొత్తం వ్యవసాయ భూమిలో 90 శాతం చెరకునే పండిస్తారు.


* రెండు చేతులతో బహుమతి తీసుకోవడం గౌరవంగా భావిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. కుడి చేతితో మాత్రమే బహుమతి తీసుకోవాలి.


దేశం: మారిషస్‌
రాజధాని: పోర్ట్‌ లూయిస్‌
జనాభా: 13,48,242
విస్తీర్ణం: 2,040 చదరపు కిలోమీటర్లు
భాషలు: ఆంగ్లం, ఫ్రెంచ్‌
కరెన్సీ: మారిషియన్‌ రుపీ


జెండా: ఎరుపు రంగు బానిస కాలంలోని రక్తపాతానికి గుర్తు, నీలం ద్వీపం చుట్టూ ఉన్న సముద్రానికి, పసుపు రంగు స్వాతంత్య్ర వికాసానికి చిహ్నం. ఆకుపచ్చ రంగు ద్వీపంలోని పచ్చదనానికి సూచిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని