చెట్లనుంచి కాగితం వరకూ...!
తెల్లని కాగితం ఎలా వస్తుంది?ఏమిటా పద్ధతులు?మనకు తెలియని విధానాలు?ఓసారి చదివేద్దామా? పుస్తకాలు, పరీక్షలు, స్కూలు... ఇలా ఎక్కడైనా కాగితం అవసరమే. ఇది లేని మన చదువుని వూహించలేం....
తయారీ ఎలా?
చెట్లనుంచి కాగితం వరకూ...!
తెల్లని కాగితం ఎలా వస్తుంది?ఏమిటా పద్ధతులు?మనకు తెలియని విధానాలు?ఓసారి చదివేద్దామా?పుస్తకాలు, పరీక్షలు, స్కూలు... ఇలా ఎక్కడైనా కాగితం అవసరమే. ఇది లేని మన చదువుని వూహించలేం. ఇది చెట్ల నుంచి వస్తుందని తెలుసు. అయితే చెక్క పేపర్గా మారడం వెనుక ఇంకా చాలా తతంగమే ఉంది. అదేంటో చూద్దాం.
* మ్యాపల్, ఓక్, పాప్లర్, యూకలిప్టస్, పైన్... లాంటి చెట్ల కలపను కాగితం తయారీలో వాడతారు.
* చెట్లను నరికి దుంగల్ని ఫ్యాక్టరీలకు తరలిస్తారు.
* పై బెరడును మిషన్ల ద్వారా తొలగిస్తారు.
* తర్వాత ఆ దుంగల్ని యంత్రాలు చిన్న చిన్న చెక్క ముక్కలుగా చేసేస్తాయి.
* ఆ ముక్కల్లో నీరు కలిపి బాయిలర్లలో ఉడికించి పేస్ట్లా చేస్తాయి.అలా గోధుమ రంగులో తయారైన పేస్ట్ని రసాయనాలు కలిపి తెల్లగా మారుస్తారు.* తెల్లగా మారిన ద్రవం నుంచి నీటిని బయటకి పంపించి పీచుమిఠాయిలా కనిపించే పదార్థాన్ని(పల్ప్) తయారుచేస్తారు. దాన్ని లెక్కకు కొలిచి ప్యాకింగ్ చేస్తారు. కాగితం తయారీలో ఇదే ముడి సరుకు.
* దీన్ని వేరే కర్మాగారంలో నీళ్లతో కలిపి ఉడికించి ద్రవరూపంలోకి మారుస్తారు.* ఆ ద్రవం యంత్రాల్లో కాలువలా ప్రవహిస్తుంటుంది.* దాన్ని వేడితో ఆవిరి చేస్తూ పైన గుండ్రటి బరువైన ఇనుప రాడ్లలాంటివాటితో చదును చేస్తూ పల్చటి కాగితాన్ని తయారు చేస్తారు.
* దాన్ని పెద్ద బండిళ్లుగా చుట్టి అమ్ముతారు.* మనం వాడుకునే టెక్స్ట్బుక్లు, నోట్బుక్లు తయారు చేసే ఫ్యాక్టరీల వాళ్లు, పత్రికల వాళ్లు ఈ బండిళ్లను కొనుక్కుంటారు. తర్వాతే కావల్సిన సైజుల్లో కత్తిరించి, ముద్రణలు చేసుకుంటారు. బైండింగులూ చేస్తారు.
ఔనా! * ఒకటన్ను కాగితాన్ని రీసైకిల్ చేస్తే పదిహేడు చెట్లను కాపాడినట్లే. |
రీసైక్లింగ్ వాడేసిన కాగితాల్ని రీసైకిల్ చేసి మళ్లీ దాన్ని కాగితంగా మారుస్తారని మనకూ తెలుసు కదూ. ఆ కాగితాల్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. దానికి నీటిని కలిపి ఉడకబెడతారు. ముద్రణలు పోయేట్టు డీఇంక్ చేస్తారు. దానిలో రసాయనాలు కలిపి తెల్లటి ద్రవాన్ని తయారు చేస్తారు. దాన్ని కాగితంగా మారుస్తారు. |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268