అడవంతా వెలిగింది!
‘ట్వింకిల్.. ట్వింకిల్.. లిటిల్ స్టార్
హౌ ఐ వండర్ వాట్ యూ ఆర్
అప్ ఎబోవ్ ది వరల్డ్ సో హై
లైక్ ఏ డైమండ్ ఇన్ది స్కై...’
మనందరికీ ఈ పోయెమ్ నోటికి వచ్చుకదా.. నేస్తాలూ! ఇప్పుడు ఈ పద్యం గురించి ఎందుకంటే.. ఈ కథనం చదివేయండి.. మీకే తెలుస్తుంది.
ఆకాశంలోని నక్షత్రాల్లానే... తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్లో చెట్టూ, పుట్టా రాత్రైతే చాలు మిణుకు మిణుకుమంటున్నాయి. కనుచూపుమేర అంతా కాంతిపరుచుకొని, అడవికి కొత్త అందాలను తీసుకువస్తున్నాయి. అచ్చం అవతార్ సినిమాలోని దృశ్యాలను కళ్లముందు కదలాడేలా చేస్తున్నాయి. దీనంతటికీ కారణం మిణుగురు పురుగులు.
ఏటా వేసవిలో...
ప్రతి సంవత్సరం వేసవిలో కోట్లాది మిణుగురులు మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా కాంతివంతంగా మారిపోతోంది. దాదాపు 8 వేల హెక్టార్లలోని అటవీప్రాంతంలో ఇలా జరుగుతోంది. పరిశోధకులు ఈ మిణుగురు పురుగుల నుంచి డీఎన్ఏ సేకరించారు. దీని మీద మరిన్ని పరిశోధనలు కొనసాగాల్సి ఉంది.
కేరళ అడవుల్లోనూ!
నిజానికి మన దేశంలో కేవలం 7 నుంచి 8 రకాల మిణుగురు పురుగులే ఉన్నాయి. అన్నామలైలో కాంతులు పంచుతున్నవి కొత్త రకానికి చెందినవై ఉంటాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. కేరళలోని అడవుల్లోనూ వీటి ఉనికి ఉండొచ్చు అని చెబుతున్నారు.
ఒకదాని తర్వాత మరోటి...!
ఈ మిణుగురులు భలే సరదాగా వెలుగులు పంచుతున్నాయి. ముందుగా ఓ చెట్టు మీద చేరిన మిణుగురులు వెలుగులు వెదజల్లితే.. తర్వాత మరో చెట్టు మీదవి కాంతులు చిమ్ముతున్నాయి. ఇలా ఒక సమూహం తర్వాత మరో సమూహం క్రమపద్ధతిలో చేస్తున్నాయి. దీంతో అడవంతా పసుపుపచ్చని కాంతులు పరుచుకుంటున్నాయి.
అప్పట్లోనే గుర్తించారు..
నిజానికి అన్నామలై టైగర్ రిజర్వ్లో ఇలాంటి మిణుగురు పురుగులను 1999లోనే అమెరికా శాస్త్రవేత్త ఒకరు గుర్తించారట. మనదగ్గరి శాస్త్రవేత్తలకు మాత్రం 2012లో వీటి గురించి తెలిసిందట. ఈ ఏడాది ఏప్రిల్లో శాస్త్రవేత్తల బృందం రాత్రిపూట అడవిలో పరిశోధించడంతో ఈ మిణుగురుల విశేషాలు మరోసారి బయటకు వచ్చాయి. ‘ట్వింకిల్.. ట్వింకిల్.. లిటిల్ బీటల్... లైక్ ఏ లైట్ ఆన్ది ట్రీ..’ అని కూడా మనం పోయెమ్ చదువుకోవచ్చన్నమాట. మొత్తానికి ఇవీ ఫ్రెండ్స్.. మిణుకు మిణుకు మిణుగురు పురుగుల విశేషాలు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!