పక్కా ప్రణాళికతోనే ఇంటి నిర్మాణం
వేసవి వచ్చిందంటే సొంతింటికి పునాది పడాల్సిందే. నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం మొదలైంది. చాలావరకు పునాదుల దశలో దర్శనమిస్తున్నాయి. నిర్మాణ వ్యయం ఇటీవల స్వల్పంగా పెరిగింది. వ్యక్తిగత ఇళ్లలో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1500 వరకు అవుతోందని నిర్మాణదారులు చెబుతున్నారు. నిర్మాణ అనుమతులు, బోర్వెల్ ఖర్చులు దీనికి అదనం.
ఈనాడు, హైదరాబాద్: వేసవి వచ్చిందంటే సొంతింటికి పునాది పడాల్సిందే. నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం మొదలైంది. చాలావరకు పునాదుల దశలో దర్శనమిస్తున్నాయి. నిర్మాణ వ్యయం ఇటీవల స్వల్పంగా పెరిగింది. వ్యక్తిగత ఇళ్లలో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1500 వరకు అవుతోందని నిర్మాణదారులు చెబుతున్నారు. నిర్మాణ అనుమతులు, బోర్వెల్ ఖర్చులు దీనికి అదనం.
ఇంటి నిర్మాణంలో ఎన్నో సాధకబాధకాలు.. అందుకే ఇల్లు కట్టిచూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. చేతిలో సొమ్ములుంటే చాలు మనకు కావాల్సిన రీతిలో వివాహ వేడుకను జరిపించేందుకు ప్రస్తుతం ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ఎన్నో వచ్చాయి. ఇల్లు సైతం గుత్తేదారుకు అప్పగిస్తే మనకు కావాల్సినట్లు కట్టి ఇస్తారు. కాకపోతే ఖర్చు కాస్త పెరుగుతుంది. కానీ నాణ్యమైన స్టీల్ వాడారో లేదో.. నది ఇసుక వాడకుండా రాతి ఇసుకతో కట్టేస్తారేమో.. ఇలాంటి ఎన్నో సందేహాల నడుమ.. చివరికి వారే సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు సిద్ధమవుతుంటారు.
ఇంటి నిర్మాణ బడ్జెట్లో స్టీల్, సిమెంట్, ఇసుకకు చేసే వ్యయమే అధికం. వీటి ధరల్లో హెచ్చుతగ్గులు సొంతిల్లు కట్టుకుంటున్నవారిని భయపెడుతుంటాయి. ప్రస్తుతం వీటి ధరలు నిలకడగా ఉన్నాయి. ఒకప్పుడు రూ.350 వరకు పరుగులు పెట్టిన బస్తా సిమెంట్ ధర ఇప్పుడు రూ.280 నుంచి రూ.300 లోపే వస్తోంది. అంతకంటే తక్కువకు కూడా కొన్ని కంపెనీల సిమెంట్ మార్కెట్లో దొరుకుతోంది. స్టీల్ ధరలు కొంచెం ఎక్కువే ఉన్నాయి. టన్ను రూ.40వేల నుంచి రూ.43వేల వరకు ఉంది. స్టీలు రకాలను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఇక ఇసుక లభ్యతకు వేసవిలో ఢోకా ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో టన్ను రూ.2000 నుంచి రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. నిర్మాణ కూలీల ధరలు కొత్త సంత్సరం నుంచి పెరగడం సొంతిల్లు కట్టుకునేవారికి కొంత భారంగా మారింది.
ముందస్తు ఒప్పందాలు.. చైనాలోని కోవిడ్-19 వైరస్ ప్రభావంతో మున్ముందు స్టీల్ ధరలపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నా.. ప్రస్తుతానికైతే లేదని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. ధరలు పెరుగుతాయని ముందస్తుగా సిమెంట్, స్టీల్ ఒకేసారి కొనుగోలు చేయలేం. సిమెంట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. స్టీల్ కూడా నాణ్యత దెబ్బతింటుంది. వాయిదాల్లో అవసరమైన సమయంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో భవిష్యత్తు ధరలు ఎలా ఉంటాయో చెప్పలేం కాబట్టి కొంతమంది ఇంటి నిర్మాణదారులు ముందే మేల్కొంటున్నారు. స్టీల్, సిమెంట్ దుకాణాదారులకు ముందస్తుగా చెల్లింపులు జరిపి అదే ధరకు అందించాలని ఒప్పందం చేసుకుంటున్నారు. ఒకవేళ పెరిగితే ఆ మేరకు ఇరువురు చెరిసగం భరించేలా పరస్పర అంగీకారానికి వస్తున్నారు.
వృథా తగ్గిస్తే.. కొత్తగా ఇల్లు కట్టుకునేవారు అవగాహన లేకపోవడంతో నిర్మాణ సామగ్రిలో ఎక్కువ వృథా జరుగుతుంది. సామగ్రిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడంతో పాటూ వృథాని అరికట్టగలిగితే పెరిగిన వ్యయాన్ని ఆ మేరకు సర్దుబాటు చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణానికి వేసుకున్న బడ్జెట్ దాటకుండా చూసుకోవచ్చు. పదిశాతం అటుఇటు అయినా ఫర్వాలేదు కానీ అంతకుమించి ఖర్చు పెరిగితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు.
చక్కటి అంచనాలు తప్పనిసరి
- మారం సతీష్, కార్యవర్గ సభ్యులు, క్రెడాయ్ హైదరాబాద్
సొంతింటి నిర్మాణంలో ఎక్కువగా మంది చేసే పొరపాటు ప్రణాళిక లేకపోవడం. దీంతో 70-80 శాతం ఇల్లు పూర్తయ్యాక నిధులు లేక నిర్మాణం ఆపేయాల్సి వస్తుంది. బ్యాంకు రుణంపై ఈఎంఐ చెల్లిస్తూ.. ఉంటున్న ఇంటికి అద్దె చెల్లిస్తూ ఇబ్బందులు పడుతుంటారు.
* సొంతిల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ప్లానింగ్ తప్పనిసరి. మంచి అర్కిటెక్ట్ను సంప్రదించి డిజైన్ గీయించుకోవాలి.
* ఇంటి డిజైన్ ఆధారంగా నిర్మాణ వ్యయం ఎంత అవుతుందనే అంచనాకు రావాలి. మనం సంప్రదించిన సంస్థలోని ఇంజినీరింగ్ నిపుణులు ఎంత ఇసుక పడుతుంది? స్టీల్, సిమెంట్ ఎంత కావాలనే వివరాలు ఇస్తారు. ః నిర్మాణ సమయంలో ఇంజినీరింగ్ లోపాలు లేకుండా వారినే తరచూ వచ్చి పర్యవేక్షించాలని కోరితే మరీ మంచిది. డిజైన్, ఇంజినీర్ల పర్యవేక్షణకు వారు కొంత ఫీజు వసూలు చేసినా వృథా అనేది చాలావరకు తగ్గతుంది.
* అనుభవం కలిగిన మేస్త్రీని మాట్లాడుకుని పనిని ప్రారంభించాలి. ప్రతి చదరపు అడుగు కూలీల వ్యయమే రూ.250 వరకు పడుతోంది. కొన్నాళ్ల క్రితం రూ.180 మాత్రమే అయ్యేది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి.
* నిర్మాణ అంచనాకు ఎప్పుడూ 10 శాతం అటుఇటు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మేరకు బడ్జెట్ను సర్దుబాటు చేసుకోవాలి. ఆలస్యమైతే వ్యయం పెరిగే అవకాశం ఉంటుంది. జాప్యం జరగకుండా చూసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!