రియల్ దూకుడు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూకుడు కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వ వేలంలో, అటు ప్రైవేటు అమ్మకాల్లోనూ స్థలాలు, ఇళ్లు భారీ ధరలు పలికాయి.
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూకుడు కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వ వేలంలో, అటు ప్రైవేటు అమ్మకాల్లోనూ స్థలాలు, ఇళ్లు భారీ ధరలు పలికాయి. హెచ్ఎండీఏ తాజాగా నిర్వహిస్తున్న వేలంలో ఉప్పల్ భగాయత్లో గరిష్ఠంగా చదరపు గజం లక్ష రూపాయలు పలకగా.. ఇటీవల జూబ్లీహిల్స్లో విక్రయించిన ఒక స్థలంలో చదరపు గజం మూడు లక్షలు దాటింది. నగరంలో ప్రముఖులు నివాసముండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో స్థలాల లభ్యత తగ్గిపోతుండటంతో ధరలు చుక్కలను తాకుతున్నాయి. కొవిడ్ తర్వాత పెద్ద ఎత్తున స్థిరాస్తులు చేతులు మారుతున్నాయి. జూబ్లీహిల్స్లో ఒక ప్రముఖ స్థిరాస్తి సంస్థ ఎండీ 1368 చదరపు అడుగుల విస్తీర్ణంలోని బంగ్లాను రూ.37 కోట్లకు కొన్నారు. గత నెలలో 841 చదరపు గజాల స్థలాన్ని మరో ప్రముఖ పాఠశాల యాజమాని రూ.26 కోట్లు వెచ్చించి కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం