క్రెడాయ్ ప్రాపర్టీ షో 29 నుంచి
కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) 11వ ప్రాపర్టీ షోని మాదాపూర్లోని హైటెక్స్లో ఈనెల 29 నుంచి మే 1 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మూడు రోజుల పాటు
ఈనాడు, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) 11వ ప్రాపర్టీ షోని మాదాపూర్లోని హైటెక్స్లో ఈనెల 29 నుంచి మే 1 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మూడు రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్కు తగ్గ స్థిరాస్తులను డెవలపర్లు ప్రదర్శించనున్నారని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణరావు తెలిపారు. రెరా అనుమతి పొందిన సమీకృత టౌన్షిప్పులు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, హరిత ప్రాజెక్టులతో పాటూ రిటైల్, వాణిజ్య, ఓపెన్ ప్లాట్ల గురించి ఒకే చోట తెలుసుకునే వీలు ప్రాపర్టీ షో కల్పిస్తుందని ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్రెడ్డి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.