నూడుల్స్ పొడిపొడిగా రావాలంటే!
నూడుల్స్ చేసిన ప్రతిసారీ ముద్దలా కలిసిపోతున్నాయి. ఇలా కాకుండా రెస్టారెంట్లో మాదిరిగా పొడిపొడిగా రావాలంటే ఏం చేయాలి?
నూడుల్స్ చేసిన ప్రతిసారీ ముద్దలా కలిసిపోతున్నాయి. ఇలా కాకుండా రెస్టారెంట్లో మాదిరిగా పొడిపొడిగా రావాలంటే ఏం చేయాలి?
- పరిణీత, హైదరాబాద్
రెస్టారెంట్ స్టైల్ నూడుల్స్ ఇంట్లో చేసుకోవాలంటే నాణ్యమైన నూడుల్స్ను కొనుగోలు చేయాలి. నూడుల్స్ రుచి మొత్తం వాటిని ఎలా ఉడికించామనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వీటిని మూడు నాలుగు నిమిషాలు ఉడికిస్తాం. అయితే ప్యాకెట్ వెనుక ఇచ్చిన సమయం కంటే అర నిమిషం తక్కువగా ఉడికించాలి. వీటిని ఉడికించే నీళ్లలో కాస్తంత ఉప్పు, చెంచా వెనిగర్ కలపాలి. ఇలా చేస్తే రుచితోపాటు నూడుల్స్ మల్లెపువ్వులా తెల్లగా ఉంటాయి. అలాగే ఉడికేటప్పుడు ఒకట్రెండు చెంచాల నూనె వేస్తే ఒకదానికొకటి అతుక్కోవు.
నూడుల్స్ సరిగ్గా ఉడికించకపోతే లోపలి భాగమంతా పిండిపిండిగా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఉడికిస్తే మెత్తగా మారి ఫ్రై చేసేటప్పుడు ముద్దలా అయిపోతాయి. దాదాపు 90 శాతం ఉడకగానే వెంటనే దించేసి చల్లటి నీళ్లను ధారగా పోయాలి. ఇలా చేస్తే నూడుల్స్ విడివిడిగా ఉండి రెస్టారెంట్ స్టైల్లో వస్తాయి. చల్లార్చకుండా నీళ్లు మాత్రమే పారబోసి గిన్నెలో ఉంచితే మరింత మెత్తగా అవుతాయి. కాబట్టి నీళ్లు పూర్తిగా పోయేలా చిల్లుల గిన్నెలో ఉంచాలి. ఇలా ఉంచినప్పుడు రెండు మూడు చెంచాల నూనె కలపాలి. దాంతో నూడుల్స్ గట్టిపడకుండా, అతుక్కోకుండా ఉంటాయి. నూడుల్స్ను ఒకట్రెండు గంటల ముందే ఉడికించుకుని నూనె కలిపి ట్రేలో పలుచగా పరుచుకోవాలి. వెజ్ నూడుల్స్లో వాడే కూరగాయల ముక్కలను సన్నగా, పొడవుగా తరగాలి. అలాగే తాజా కూరగాయల్ని ఎంచుకోవాలి. తాజా మిరియాల పొడిని వేస్తే రుచి పెరుగుతుంది. నూడుల్స్ను ఎప్పుడూ పెద్ద మంటపై ప్రత్యేకమైన కడాయిలో చేయాలి. ఈ కడాయికి అడుగు పలుచగా ఉండి వేడి నూడుల్స్కు నేరుగా, త్వరగా తగులుతుంది. నూడుల్స్ను గరిటెతో కలపొద్దు. నూడుల్స్లో గుడ్లు, పుట్టగొడుగులు, ఉడికించిన చికెన్తో కలిపి చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల