రెస్టారెంట్ స్టైల్ పుట్టగొడుగుల పులావ్ కావాలంటే!
బాస్మతి బియ్యం, కొబ్బరిపాలు, బటన్ మష్రూమ్, మసాలాలు కలిపి సులభంగా, చాలా రుచికరంగా చేసుకునే తేలికైన వంటకం పుట్టగొడుగుల పులావ్. దీని తయారీలో సాధ్యమైనంత వరకు తాజా పుట్టగొడుగులు ఉపయోగించాలి.
మొన్నీమధ్య రెస్టారెంట్లో మష్రూమ్ పులావ్ తిన్నా చాలా బాగుంది. అలానే ఇంట్లో తయారు చేసుకోవచ్చా?
-లక్ష్మి, హైదరాబాద్
బాస్మతి బియ్యం, కొబ్బరిపాలు, బటన్ మష్రూమ్, మసాలాలు కలిపి సులభంగా, చాలా రుచికరంగా చేసుకునే తేలికైన వంటకం పుట్టగొడుగుల పులావ్. దీని తయారీలో సాధ్యమైనంత వరకు తాజా పుట్టగొడుగులు ఉపయోగించాలి. అవి దొరకనప్పుడు ఎండు పుట్టగొడుగులు వాడుకోవచ్చు. వీటితోపాటు రకరకాలైన కూరగాయ ముక్కలూ వేసుకోవచ్చు. బఠాణీ, ఆలూ, క్యారెట్, కాప్సికం, మొక్కజొన్న, బ్రొకొలీ, బేబీ కార్న్ లాంటి కూరగాయలు వాడుకోవచ్చు.
మష్రూమ్ పులావ్ తయారు చేయడానికి కప్పున్నర బాస్మతి బియ్యం, పావుకిలో బటన్ పుట్టగొడుగులు, ఒక్కోటి చొప్పున ఉల్లిపాయ, టొమాటో, ఆలుగడ్డ; రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అర చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద, కప్పున్నర చిక్కటి కొబ్బరిపాలు అవసరమవుతాయి. ఉప్పు తగినంత వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మూడు నాలుగు యాలకులు, ఏడెనిమిది మిరియాలు, చెంచా జీలకర్ర కూడా కావాలి.
పులావ్ తయారీలో పాత బాస్మతి బియ్యం వాడుకోవాలి. వీటితో పులావ్ చేస్తే పొడి పొడిగా వస్తుంది. సువాసనలు వెలువడతాయి. పాత బియ్యానికి ఒక వంతు బియ్యానికి రెండొంతుల నీళ్లు పోయాలి. ఎలక్ట్రిక్ కుక్కర్లో తేలికగా చేసుకోవచ్చు. నూనె బదులుగా నెయ్యి వాడితే రుచి పెరుగుతుంది.
వేడి నూనె/నెయ్యిలో గరంమసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. దీనివల్ల మసాలా ఫ్లేవర్ నూనెకి పట్టి పులావ్ సువాసనలు వెదజల్లుతుంది. ఉల్లిపాయలు పొడవుగా కోసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని నూనెలో వేయించుకోవాలి. లేకపోతే పచ్చివాసన వస్తుంది. కూరగాయల ముక్కలు, పుట్టగొడుగులు వేసి చిన్నమంటపై ఫ్రై చేయాలి. ఆ తర్వాత రైస్ వేసి రెండు నిమిషాలు వేయిస్తే ఆయిల్ రైస్కి పట్టి ఉడికిన తర్వాత ముద్ద కాకుండా ఉంటుంది. కొబ్బరిపాలు, నీళ్లను బియ్యంలో పోయాలి. కొబ్బరి పాలకు బదులుగా వెజిటేబుల్ స్టాక్ కూడా కలపొచ్చు. ఈ ప్యాకెట్లు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. స్టాక్ వాడేటప్పుడు ఉప్పు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో కూడా సాల్ట్ ఉంటుంది మరి. చివరగా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి.
* బాస్మతి బియ్యం బదులు పాత సోనామసూరి రైస్ కూడా వాడుకోవచ్చు.
* మష్రూమ్స్లో... షిటేక్, క్రిమిని, బటన్ రకాలుంటాయి.
* మష్రూమ్స్ని బాగా కడగాలి. లేదంటే అందులోని మట్టి పులావ్లో కలిసిపోతుంది. అలాగే పుట్టగొడుగులను చిన్న ముక్కలుగా కోయొద్దు. ఇలా చేస్తే అన్నంలో కరిగిపోతాయి. ఒక పుట్టగొడుగును రెండు ముక్కలుగా కోసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్