సారవకోట.. చక్కిలాలు!
చూడటానికి జంతికల్లా ఉండే చక్కిలాలు... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అందులోనూ శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల కేంద్రంలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ ప్రత్యేకమైన వంటకాన్ని తయారుచేస్తున్నాయి. ఆ గ్రామంలో 12 కుటుంబాలు చక్కిలాలను తయారుచేస్తున్నాయి. ప్రత్యక్షంగా 40, పరోక్షంగా మరో 100 మందికి ఈ వంటకం ఉపాధి కల్పిస్తోంది. దీనికున్న ప్రత్యేక రుచి వల్ల రోజురోజుకీ డిమాండూ పెరుగుతోంది.
బియ్యం నూకతోనే...
బియ్యం నూకను పిండిగా చేస్తారు. తగినంత ఉప్పు, నీరు జోడిస్తారు. నువ్వులు నానబెట్టి చేత్తో ముద్దగా చేసి పిండిలో కలుపుతారు. శుభ్రమైన సంచిని నేలపై పరిచి ఎలాంటి యంత్రాలూ ఉపయోగించకుండా కేవలం చేత్తోనే చక్కిలాలను చేస్తారు. అవి కాస్త ఆరిన తర్వాత నూనెలో ముదురు గోధుమ రంగు వచ్చేవరకూ వేయిస్తారు. ఇలా ఘుమఘుమలాడే వాసనతో రుచికరమైన చక్కిలాలను తయారుచేయడం సారవకోట మహిళల సొంతం.
రెండు సైజుల్లో తయారీ
ఈ చక్కిలాలను రెండు సైజుల్లో తయారు చేస్తారు. ఒక్కో ప్యాకెట్లో పదేసి ఉంటాయి. చిన్న సైజువి రూ.30, పెద్ద సైజువి రూ.50. సారవకోట మీదుగా వెళ్లేవాళ్లూ చక్కిలాలు కొనకుండా వెళ్లరు. సిక్కోలు వాసులు ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు వీటిని వెంట తీసుకెళ్తారు. వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఆడపిల్లలకు సారెలు పెట్టే సమయంలోనూ వీటికి ప్రత్యేక స్థానం కల్పిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ ఈ వంటకం విస్తరించింది. చక్కిలాలను చుప్పులు అని కూడా పిలుస్తుంటారు.
ఉపాధిగా ఎలా మారింది?
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలానికి చెందిన సావిత్రమ్మ 50 ఏళ్ల కిందట సారవకోటలోని తన కుమార్తె సత్యవతి ఇంటికి వెళ్లినప్పుడు చక్కిలాలు తయారు చేయడం నేర్పించారు. నాడు ఆమె వేసిన బీజం నేడు మహావృక్షమైంది. అమ్మ చేతి వంటకాన్ని నేర్చుకున్న సత్యవతి దాని తయారీని మరికొందరు మహిళలకు నేర్పించింది. అలా ఇప్పుడు సారవకోటలో మొత్తం 12 కుటుంబాలు పూర్తిగా ఈ వంటకం తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఒక్కో కుటుంబం ఈ వ్యాపారం వల్ల రోజుకి కనీసం రూ.1000 ఆదాయం పొందుతోంది. ఒక్కొక్కరు రోజూ రూ.3-5 వేల ఆదాయం వచ్చేలా చక్కిలాలు తయారుచేస్తారు.
- ప్రవీణ్ కుమార్ రుత్తల, శ్రీకాకుళం జిల్లా
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
President Election: నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి.. రాష్ట్రపతి రేసులో ఆ ఇద్దరే!
-
Sports News
RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
-
General News
Health: ఉబ్బిన సిరలకు సూపర్ గ్లూ..ఏంటో తెలుసుకోండి
-
General News
Andhra News: ఈఏపీసెట్-2022కు ఏర్పాట్లు పూర్తి... ఏపీ, తెలంగాణలో పరీక్షాకేంద్రాలు
-
Politics News
Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ
-
India News
తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Acharya: ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు.. రామ్చరణ్ ఆ రోల్ చేయకపోతే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ