రొయ్యల పచ్చడి రుచి పెరగాలంటే!
నాకు రొయ్యల పచ్చడి అంటే చాలా ఇష్టం. చేసే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతారా?
- వెంకట లక్ష్మి, వైజాగ్
జ: పచ్చడి రుచిగా రావాలంటే నాణ్యమైన రొయ్యలను ఎంచుకోవాలి. పచ్చడికి పెద్ద రొయ్యలే బాగుంటాయి. చిన్నవి వద్దు. ముందుగా వీటిని బాగా శుభ్రం చేసి గిన్నెలో నీళ్లు పోసి మూతపెట్టి కాసేపు ఉడికించాలి. రొయ్యలు ఒకవంతు ఉడకగానే స్టవ్ ఆఫ్ చేయాలి. నీళ్లు పూర్తిగా పారబోసి రొయ్యలను తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే పచ్చడిలో వేశాక మరింత రుచిగా, మెత్తగా ఉంటాయి. మరో గిన్నెలో చింతపండు వేసి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.
మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలను నూనె లేకుండా వేయించి చల్లార్చుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు రొయల్ని నూనెలో వేయించాలి. ఈ పచ్చడికి వేరుసెనగ నూనె రుచిని ఇస్తుంది. సాధ్యమైనంత వరకు గానుగ నూనె వాడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దోరగా వేగిన రొయల్ని తీసి పక్కన పెట్టుకుని అదే నూనెలో అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడి, రొయ్యలు, చింతపండు గుజ్జు ఒకదాని తర్వాత మరొకటి అన్ని నూనెలో కలిపితే పచ్చడి రెడీ.
చింతపండు ఇష్టపడని వారు పులుపు సరిపోయేంత నిమ్మరసం కలపొచ్చు. కొబ్బరి పొడి, ధనియాల పొడి కూడా కలిపితే పచ్చడిలో గ్రేవీ బాగా వస్తుంది. కొంతమంది కలిపిన పచ్చడికి నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు కూడా పెడుతుంటారు. అలాగే మసాలా వేయించి పొడి చేసి కలపడానికి బదులు నేరుగా గరంమసాలా కూడా కలిపేస్తారు.
నిమ్మరసం బదులు వెనిగర్నూ వాడుకోవచ్చు. తాలింపులో మెంతులు లేదా చెంచా మెంతిపిండి కూడా కలపొచ్చు. ఈ పచ్చడి సాధ్యమైనంత వరకు గాజు సీసా/ పింగాణీ జాడీలో భద్రపరుచుకోవాలి. మూత గట్టిగా పెట్టడం వల్ల చాలారోజుల వరకు పాడవకుండా ఉంటుంది.
పచ్చడి తయారీలో కల్లుప్పును వాడితే ప్రత్యేకమైన రుచి వస్తుంది. మసాలా దినుసులను చిన్నమంటపై దోరగా వేయించాలి. ఏమాత్రం ఎక్కువగా వేగినా రుచి మారిపోతుంది. ఉడికించిన రొయ్యల్లో ఏమాత్రం నీళ్లు లేకుండా పూర్తిగా డ్రై చేసిన తర్వాతే వేయించుకోవాలి. లేదంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. పచ్చడి తయారీకి వాడే పాత్రలన్నీ పొడిగా ఉండాలి. పచ్చడిలో ఎండు మిరపకాయలకు బదులుగా కొన్నిచోట్ల పచ్చిమిరపకాయలు కూడా వాడుతుంటారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: పెద్దోళ్లు పట్టించుకోలేదు.. పసిపిల్లలు చేయందించారు..
-
India News
Nitish kumar: 2014లో మోదీ విన్నరే.. 2024లో గెలుస్తారా?: నీతీశ్
-
India News
Varun Gandhi: జెండాల కొనుగోలుకు పేదల తిండి లాక్కోవడమా..?
-
Sports News
Team India: భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లే కావాలి: మాజీ క్రికెటర్
-
General News
Telangana News: మళ్లీ విధుల్లోకి ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు.. మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు
-
Politics News
Payyavula Keshav: చంద్రబాబు దిల్లీ వెళితే తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు: పయ్యావుల
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!