రెండు సముద్రాల మధ్య..
ప్రకృతి చెక్కిన వాయులీన వాద్యాన్ని తలపిస్తున్న ఈ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది కదూ! ఓ వైపు బంగాళాఖాతమూ మరో వైపు హిందూ మహా సముద్రమూ చెరో పక్కనా తాకే ఈ తీరానికి ధనుష్కోడి అని పేరు. తమిళనాడు రాష్ట్రంలోని పాంబన్ ద్వీపంలో ఉంది. రెండు సాగరాల మధ్యలో కనిపిస్తున్న ఈ రోడ్డును ‘భారతదేశపు చిట్టచివరి రహదారి’గా చెబుతుంటారు. శ్రీరాముడు లంక వెళ్లటానికి ఏర్పాటు చేసుకున్న వంతెన ‘రామసేతు’ ఇక్కడి నుంచే మొదలవుతుందంటారు. ఈ తీరం నుంచి శ్రీలంక దాదాపు 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఒకప్పుడు జనావాసాలతో కళకళలాడుతూ ఇక్కడ చిన్న పట్టణం ఉండేది. 1964 తుపానుకు ధ్వంసమవ్వడంతో ఇప్పుడా ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. ఇప్పుడైతే ఊరూ లేదూ జనాలూ ఉండరు. కానీ రామేశ్వరం వెళ్లే పర్యటకులు... ఇక్కడికి వచ్చి రెండు సముద్రాల కెరటాల సవ్వళ్లనూ, ప్రకృతి అందాల్నీ ఆస్వాదిస్తుంటారు. ఇంతకీ ధనుష్కోడి అంటే అర్థం తెలుసా... ‘వింటి కొన’ అని!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్