మొక్కలకు మొక్కలే మందు!
క్రిమికీటక సంహారిణులు ఎక్కువగా వాడటం వల్ల ఆయా పురుగులూ కీటకాలే కాదు, పర్యావరణానికీ వ్యవసాయానికీ ఎంతో అవసరమైన తేనెటీగలు కూడా చనిపోతున్నాయి.
మొక్కలకు మొక్కలే మందు!
క్రిమికీటక సంహారిణులు ఎక్కువగా వాడటం వల్ల ఆయా పురుగులూ కీటకాలే కాదు, పర్యావరణానికీ వ్యవసాయానికీ ఎంతో అవసరమైన తేనెటీగలు కూడా చనిపోతున్నాయి. ఆ కారణంతోనే ఎరువులే కాదు, పురుగుమందుల్ని సైతం సేంద్రియమైనవే వాడమంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మహాగని, సిట్రస్ జాతులకు చెందిన మొక్కల్లో లిమనాయిడ్స్ అనే కర్బన రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి మొక్కల్ని కీటకాల నుంచి రక్షిస్తాయి. అదేసమయంలో తేనెటీగలకు ఎలాంటి హానీ కలిగించవు. అయితే వీటినుంచి ఆ లిమనాయిడ్లను భారీ మొత్తంలో సేకరించడం ఖర్చుతో కూడుకున్నపని. అందుకే బ్రిటన్లోని జాన్ ఇనెస్ సెంటర్కు చెందిన నిపుణులు అజాడిరోన్ అనే లిమనాయిడ్ను ఉత్పత్తి చేసే చైనాబెర్రీ(మెలియా అజెడరక్) మొక్కను గుర్తించారు. ఆపై దీని జన్యుక్రమాన్ని మరో రకం లిమనాయిడ్ను ఉత్పత్తిచేసే పొగాకు కుటుంబానికి చెందిన మొక్కలో ప్రవేశపెట్టారు. దాంతో పొగాకు మొక్క నుంచి రెండు రకాల లిమనాయిడ్లనూ భారీ మొత్తంలో తక్కువ ధరలో తేలికగా తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు. సో, ఈ పద్ధతి ద్వారా మున్ముందు సేంద్రియ కీటకసంహారిణుల్ని పెద్దయెత్తున రూపొందించవచ్చన్నమాట.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత