కొండపై వినాయకుడు

వినాయకస్వామి దీనదయాళుడు. భక్తులు నిండుమనస్సుతో పూజిస్తే అనుగ్రహిస్తాడు. తమిళనాడులోని తిరుచ్చిలోని రాక్‌ఫోర్ట్‌పై స్వయంభువుగా వెల‌సిన‌ స్వామి భక్తులకు ఆశీస్సులను ప్రసాదిస్తుంటాడు. సాధారణంగా స్వామివారి ఆలయాలు భూమిపై ఉంటే ఇక్కడ కొండపై ఉండటం విశేషం.

Updated : 14 Mar 2023 12:42 IST

వినాయకస్వామి దీనదయాళుడు. భక్తులు నిండుమనస్సుతో పూజిస్తే అనుగ్రహిస్తాడు. తమిళనాడులోని తిరుచ్చిలోని రాక్‌ఫోర్ట్‌పై స్వయంభువుగా వెల‌సిన‌ స్వామి భక్తులకు ఆశీస్సులను ప్రసాదిస్తుంటాడు. సాధారణంగా స్వామివారి ఆలయాలు భూమిపై ఉంటే ఇక్కడ కొండపై ఉండటం విశేషం.

స్థలపురాణం: సీతను బందీగా ఉంచడాన్ని రావణుని సోదరుడు విభీషణుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. వెంటనే రాముని వద్దకు వెళ్లి ఆశ్రయం పొందుతాడు. యుద్ధంలో రావణుడిని శ్రీరాముడు సంహరిస్తాడు. విభీషణుడు తనకు చేసిన సాయానికి గుర్తుగా రంగనాథుని విగ్రహాన్ని రాముడు ప్రదానం చేస్తాడు. అయితే విభీషణుడు అసురుడు. దీంతో దేవతలు రంగనాథ విగ్ర‌హం శ్రీలంకకు చేరుకోకుండా అడ్డుకోవాలని నిర్ణయిస్తారు. ఇందు కోసం గణపతిని ప్రార్థిస్తారు. స్వామి ప్రత్యక్షమై వారి కోరికను తీరుస్తానని మాట ఇస్తారు. విభీషణుడు తిరుచ్చి సమీపంలో విగ్రహాన్ని తీసుకువెళుతుండగా కావేరి నది కనిపించడంతో పుణ్యస్నానం చేయాలని భావిస్తాడు. అయితే విగ్రహాన్ని నేల మీద పెడితే శాశ్వతంగా అక్కడే ఉండిపోతుంది.

దీంతో అక్కడే పశువుల కాపరియైన బాలుడిని సాయం కోరుతాడు. కొద్ది సమయం మాత్రమే తాను విగ్రహాన్ని పట్టుకుంటానని సమయం ముగిసిన తరువాత భూమిపైన పెట్టివేస్తానని బాలుడు చెప్పడంతో అందుకు అంగీకరించిన విభీషణుడు విగ్రహాన్ని అతనికి అందజేస్తాడు. బాలుని రూపంలో ఉన్నది సాక్షాత్తు వినాయకుడు కావడం విశేషం. కొద్ది సేపటికే గణపతి శ్రీరంగనాథ‌ స్వామి విగ్రహాన్ని భూమిపైన పెట్టడంతో నదిలో ఉన్న విభీషణుడు ఆగ్రహించి పరుగున ఒడ్డుకు వచ్చాడు. అయితే స్వామి విగ్రహాన్ని అక్కడ నుంచి తీయడం సాధ్యం కాలేదు. దీంతో ఆగ్రహంతో బాలుడిని పట్టుకోవాలని చూస్తాడు. దీంతో బాలుడు వెంటనే పారిపోతాడు. అతన్ని పట్టుకోవాలని పరుగెత్తడం ప్రారంభించాడు. చాలాదూరం పరుగెత్తిన వినాయకుడు ఒక కొండపైకి వెళ‌తాడు. చివరకు అతన్ని పట్టుకున్న విభీషణుడు నుదుటిపై గట్టిగా కొట్టడంతో స్వామి నవ్వుతూ అసలు రూపంతో దర్శనమిస్తాడు. విభీషణుడు వెంటనే క్షమాపణలు కోరుకోవడంతో గణపతి అతనిని ప్రసాదించి శ్రీరంగనాథ‌స్వామి కావేరి తీరంలోనే ఉంటారని వెల్లడిస్తాడు. అనంతరం వినాయకుడు అక్కడే స్వయంభువుగా వెలసినట్టు తెలుస్తోంది.

ఎలా చేరుకోవాలి...

* తమిళనాడులోని తిరుచ్చికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు సౌకర్యముంది.
* తిరుచ్చి రైల్వేస్టేషన్‌లో దిగి ఇక్కడకు చేరుకోవచ్చు.
* తిరుచ్చి విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని