సంగీత సాధన
స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రసంగాల్లోనే కాదు సంగీత సాధనలోనూ ప్రావీణ్యత సంపాదించారు. శ్రావ్యమైన కంఠంతో భావయుక్తంగా గానం చేస్తుంటే శ్రోతలు పరవశించేవారు.
స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రసంగాల్లోనే కాదు సంగీత సాధనలోనూ ప్రావీణ్యత సంపాదించారు. శ్రావ్యమైన కంఠంతో భావయుక్తంగా గానం చేస్తుంటే శ్రోతలు పరవశించేవారు. పాఠశాల, కళాశాలల్లో ఆయన తన సంగీతంతో అలరించేవారు. ముఖ్యంగా రామకృష్ణ పరమహంస శిష్యుడి రాగాలాపనకు భావసమాధి స్థితిలోకి వెళ్లిపోయేవారు. వివేకానంద ఆనాటి ప్రఖ్యాత సంగీత విద్వాంసులైన వేణీమాధవ్, ఉస్తాద్ అహ్మద్ ఖాన్ల వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. సుప్రసిద్ధ ద్రుపద్ సంగీత విద్వాంసుడైన జ్వాలాప్రసాద్ వద్ద సంగీతం కూడా అభ్యసించారు. కాశీనాథ్ ఘోశాల్ వద్ద తబలా, పక్వాజ్ తదితర సంగీత వాయిద్యాలను నేర్చుకున్నారు. ఒకసారి వివేకానంద మిత్రుడు ఒకరు వేదికపై శరీరాన్ని వివిధ భంగిమల్లో కదులుస్తూ, కచేరీ చేస్తున్నాడు. అది గమనించిన వివేకానంద వేదిక దిగగానే మిత్రుడితో ‘సంగీతమంటే కేవలం రాగతాళాలు మాత్రమే కాదు. భావం, వాచ్యం కూడా ముఖ్యమే. కానీ అనవసరమైన కదలికలు ఆలాపనకు మంచిది కాదు. సంగీతం ఉత్తమోత్తమ కళ. ఈ సాధన కూడా భగవదారాధనే’ అంటూ సంగీత విశిష్టతను వివరించారు.
చైతన్య
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Kuppam: తాళం వేసిన నాయకులకు వైకాపా షాక్
-
Chandrayaan-3: ల్యాండర్, రోవర్పై సన్నగిల్లుతున్న ఆశలు
-
IRCTC: ఐఆర్సీటీసీ విమాన టికెట్లపై జీరో కన్వీనియెన్స్ ఫీజు
-
చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారు: అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్య
-
Train Accident: అకస్మాత్తుగా ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చిన రైలు