తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం ప్రభావం ఉంటుందా?
ఈ నెల 26న (బుధవారం) చంద్ర గ్రహణం. ఆ సమయంలో చంద్రుడు ఎర్రటి రంగులో కనిపించనున్నాడు. అయితే, గ్రహణం భారతదేశంలో కనిపించదని.....
హైదరాబాద్: ఈ నెల 26న (బుధవారం) చంద్ర గ్రహణం. ఆ సమయంలో చంద్రుడు ఎర్రటి రంగులో కనిపించనున్నాడు. అయితే, గ్రహణం భారతదేశంలో కనిపించదని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం లేదని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. బుధవారం విశాఖ నక్షత్రం, వైశాఖ పౌర్ణమి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం కనబడకపోవడం వల్ల ఎలాంటి గ్రహణ విధులు పాటించాల్సిన అవసరం లేదు. ఆలయాలు యథావిధిగా కొనసాగించవచ్చు. వైశాఖ పౌర్ణమి ఉత్సవాలు, పూజలు యథాతథంగా కొనసాగించుకోవచ్చు. బుధవారం సంపూర్ణ చంద్రగ్రహణం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్లోని తూర్పు ఈశాన్య ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. గ్రహణం కనిపించే దేశాల్లో సనాతన ధర్మాన్నిపాటించేవారు అక్కడ గ్రహణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ఆచరించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం ఏర్పడకపోవడం వల్ల ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.