Anand Mahindra: గణేశుడు ఇలా వీడ్కోలు చెబుతున్నాడు.. ఆ వీడియోకు 21 మిలియన్ల వ్యూస్
సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో గణేశుడికి వీడ్కోలు పలికారు..........
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు కన్నుల పండువగా ముగిశాయి. గణనాథుడి విగ్రహాలను భక్తకోటి శుక్రవారం నిమజ్జనం చేశారు. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో గణేశుడికి వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్లో పంచుకోగా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
ఓ ప్రాంతంలో తల్లితోపాటు ఉన్న ఓ గున్న ఏనుగు.. వీడ్కోలు పలుకుతున్నట్లుగా తన తొండంను అదేపనిగా తిప్పుతున్న వీడియోను మహీంద్రా షేర్ చేశారు. దీనికి తనదైన శైలిలో వ్యాఖ్యలు జోడించారు. ‘గణేశుడు తన తొండంతో మనకు వీడ్కోలు పలుకుతున్నట్లుగా భావిస్తున్నా. గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది కలుద్దాం’ అంటూ పేర్కొన్నారు. కాగా ఆయన పంచుకున్న ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ క్లిప్పింగ్ను 21.4మిలియన్ల మంది వీక్షించారు. నెటిజన్లు సైతం అంతే ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘గణేశుడు ఆఫ్రికా వెళ్లాడా?’ అని ఓ నెటిజన్ అనుమానం వ్యక్తం చేయగా, క్రికెటర్ రవీంద్ర జడేజా అర్ధ శతకం చేసిన తర్వాత ఇలాగే బ్యాటు తిప్పుతాడు అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె