Viral video: క్షణం ఆలస్యమైనా ప్రాణాలు పోయేవే.. ఎలా కాపాడారో చూడండి!
కదులుతున్న రైలు ఎక్కుతూ, దిగుతూ ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతుండటం చూస్తూనే ఉంటాం. అయినా కొందరిలో మార్పు రావడం లేదు.........
ఇంటర్నెట్ డెస్క్: కదులుతున్న రైలు ఎక్కుతూ, దిగుతూ ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతుండటం చూస్తూనే ఉంటాం. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. అదే తరహాలో వ్యవహరిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని భోపాల్ రైల్వేస్టేషన్లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ కదులుతుండగా ఓ వ్యక్తి కిందకు దిగుతూ ప్రమాదవశాత్తూ ప్లాట్ఫామ్, పట్టాల మధ్య జారిపడగా.. అప్రమత్తమైన రైల్వే పోలీసు, తోటి ప్రయాణికులు ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని రక్షించారు. పరుగెత్తుకుంటూ వెళ్లి పైకి లాగారు. భద్రతా సిబ్బంది రెప్పపాటు ఆలస్యం చేసినా ఆ వ్యక్తి ప్రాణాలు పోయేవే. పశ్చిమ మధ్య రైల్వే ట్విటర్లో ఈ వీడియోను పంచుకోగా వైరల్గా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?