Viral video: నడిరోడ్డుపై పడిపోయి.. ఎలా ప్రాణాలు దక్కించుకున్నాడో చూడండి..!
ద్విచక్రవాహనంపై నుంచి నడిరోడ్డుపై పడిపోయిన ఓ వ్యక్తికి ట్రక్కు రూపం పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది.
కౌలలంపూర్: ద్విచక్రవాహనంపై నుంచి నడిరోడ్డుపై పడిపోయాడు ఓ వ్యక్తి. క్షణాల్లోనే వెనక నుంచి ఓ ట్రక్కు అతడిపైకి దూసుకొచ్చింది. ప్రాణాలు దక్కడం కష్టమే అనుకుంటున్న సమయంలో.. అతడు చురుగ్గా స్పందించి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీడియో కొద్దిరోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మలేసియాలో జరిగిన ఈ ఘటనను అక్కడున్నవారు చిత్రీకరించడంతో వెలుగులోకి వచ్చింది.
ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి.. బండి జారడంతో నడిరోడ్డుపై పడిపోయాడు. అప్పటికే అతడివైపునకు ఓ ట్రక్కు దూసుకొస్తోంది. బ్రేక్స్ వేసినా, అతడిని తప్పించడం కష్టమే. కిందపడిన వెంటనే ట్రక్కును గమనించిన ఆ వ్యక్తి.. బండి అక్కడే వదిలేసి, చిరుత వేగంతో అక్కడి నుంచి పక్కకు తప్పుకొన్నాడు. వెంట్రుకవాసిలో ట్రక్కు బారి నుంచి బయటపడ్డాడు. ఒక్క సెకను ఆలస్యం చేసినా.. అతడి ప్రాణాలు దక్కేవి కావు. పెను ప్రమాదం నుంచి అతడు ప్రాణాలు దక్కించుకోవడంతో నెటిజన్లు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్