Uttarakhand: కరెంట్‌ షాక్‌తో పిల్ల కొండముచ్చు మృతి.. తల్లి ఆవేదన వర్ణనాతీతం

చనిపోయిన పిల్ల కొండముచ్చును చూసి తల్లి స్పందించిన తీరు కంటతడి పెట్టిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని గోపేశ్వర్‌లో ప్రమాదవశాత్తు ఓ పిల్ల కొండముచ్చు..

Published : 19 Dec 2021 22:20 IST

గోపేశ్వర్‌: చనిపోయిన పిల్ల కొండముచ్చును చూసి తల్లి స్పందించిన తీరు కంటతడి పెట్టిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని గోపేశ్వర్‌లో ప్రమాదవశాత్తు ఓ పిల్ల కొండముచ్చు.. ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి కరెంట్‌ షాక్‌తో చనిపోయింది. అది చూసిన తల్లి.. పిల్ల కొండముచ్చు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అక్కడక్కడే తిరుగుతూ ఉండటం హృదయాల్ని ద్రవింపజేస్తోంది. చివరకు విద్యుత్ నిలిచిపోయిన సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కి.. నిర్జీవంగా పడి ఉన్న బిడ్డను గుండెలకు హత్తుకుని పరిగెత్తింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Read latest Viral Videos and Telugu News



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని