చేత్తో నెడితేనే నిర్మాణాలు నేలమట్టం.. వైరల్గా మారిన యూపీ ఎమ్మెల్యే వీడియో!
ఉత్తర్ప్రదేశ్లోని రాణిగంజ్(Raniganj) నియోజకవర్గంలో చేపడుతోన్న ఓ కళాశాల భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలను ఎండగట్టారు అక్కడి విపక్ష ఎమ్మెల్యే డా.ఆర్కే వర్మ(RK Verma). గురువారం క్షేత్రస్థాయిలో తనిఖీకి...
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని రాణిగంజ్ (Raniganj) నియోజకవర్గంలో చేపడుతున్న ఓ కళాశాల భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలను ఎండగట్టారు అక్కడి సమాజ్వాదీ ఎమ్మెల్యే డా.ఆర్కే వర్మ (RK Verma). గురువారం క్షేత్రస్థాయిలో తనిఖీకి వచ్చిన ఆయన.. కేవలం చేత్తో నెడితేనే కూలిపోతున్న ఆ నిర్మాణాల వీడియోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఇది నాలుగు అంతస్తుల ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ భవన నిర్మాణమని పేర్కొన్నారు. ‘ఇటువంటి నాసిరకం పనులతో ప్రభుత్వం.. యువత భవిష్యత్తును నిర్మించడం లేదు. వారి మరణానికి ఏర్పాట్లు చేస్తోంది. రూ.కోట్ల వ్యయంతో చేపడుతున్న పనుల్లో అవినీతి.. ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది’ అని విమర్శించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం శుక్రవారం ట్విటర్ వేదికగా సంబంధిత వీడియో పంచుకున్నారు. అవినీతిపై అధికార భాజపాను లక్ష్యంగా చేసుకున్నారు. ‘భాజపా పాలనలో అవినీతి అద్భుతం. సిమెంట్ లేకుండానే కళాశాల నిర్మాణంలో ఇటుకలు పేర్చారు’ అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. పనుల్లో నాణ్యతాలేమిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు సంబంధిత అధికారులు.. నిర్మాణ సామగ్రి నమూనాలు సేకరించి, తనిఖీలకు పంపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం