Viral video: స్పృహతప్పి రైలుకిందపడిన యువతి.. ఆపై క్షేమంగా..!

రైల్వేస్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఓ యువతి మృత్యువు అంచువరకు వెళ్లి తృటిలో ప్రాణాలతో బయటపడింది. నడుస్తున్న రైలు కింద పడినప్పటికీ.......

Published : 20 Apr 2022 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వేస్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఓ యువతి మృత్యువు అంచువరకు వెళ్లి తృటిలో ప్రాణాలతో బయటపడింది. నడుస్తున్న రైలు కింద పడినప్పటికీ.. ఆమె క్షేమంగా బయటపడింది. ఈ ఘటన అర్జెంటీనాలో జరిగింది. క్యాండెలా అనే యువతి బ్యూనస్‌ ఎయిర్స్‌ రైల్వేస్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తోంది. అయితే ఆమెకు రక్తపోటు తగ్గడంతో కళ్లుతిరిగి పట్టాలపై వస్తున్న రైలు కిందపడిపోయింది. ఈ ఊహించని సంఘటనకు అక్కడున్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆమె మరణించిందనే అంతా భావించారు. రైలు ఆగడంతో యువతిని కొందరు పైకి లాగగా.. స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. కొద్దిసేపటికి ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

కోలుకున్న అనంతరం ఆ ఘటనపై క్యాండిలా ఓ న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడింది. తానింకా బ్రతికున్నాననే విషయాన్ని నమ్మలేకపోతున్నానని పేర్కొంది. ‘నేనెలా బ్రతికున్నానో నాకే అర్థం కావడంలేదు. ఇది నాకు పునర్జన్మ. రక్తపోటు తగ్గిపోయి కళ్లు తిరిగాయి. నా పక్కన ఉన్న వ్యక్తికి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నా. కానీ సాధ్యం కాలేదు. రైల్వే కంపార్ట్‌మెంట్‌పై, అక్కడినుంచి కింద పడిపోయినట్లు కాస్త గుర్తుంది. తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు’ అని పేర్కొంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని