దూరంగా.. దగ్గరగా..

అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ప్రేమ జంట ‘నాకు నువ్వు.. నీకు నేను!!’ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం సర్వసాధారణం. అదే దూరం భారమైనప్పుడో...

Published : 18 Apr 2020 00:38 IST

టచ్‌ చేశారు!

అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ప్రేమ జంట ‘నాకు నువ్వు.. నీకు నేను!!’ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం సర్వసాధారణం. అదే దూరం భారమైనప్పుడో.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడో ఓ ప్రేమ జంట ఒకరి కోసం మరొకరు ‘నీకు నేను ఉన్నాను’ అని చెప్పడంలో ధైర్యం కనిపిస్తుంది. ప్రేమలో నిజాయతీ తెలుస్తుంది. ఈ ఫొటోలో కనిపించే జంట పేర్లు ఆల్బర్ట్‌, కెల్లీ. ప్రియురాలు కెల్లీకి క్యాన్సర్‌ సోకడంతో కీమో థెరపీ చేయించుకుంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆసుపత్రిలోకి సంరక్షకుల్ని అనుమతించకపోవడంతో ఇలా తమ ప్రేమని చాటుకున్నారు. ఆసుపత్రి బయట పార్కింగ్‌లో ‘నీ పక్కనే లేకపోవచ్చుగానీ.. ఇదిగో నీ కోసం ఇక్కడే వేచి చూస్తున్నా. హాస్పిటల్‌ సిబ్బందికి ధన్యవాదాలు!!’ అని రాసిన బోర్డుని ముందు పెట్టుకుని కూర్చున్నాడు ఆల్బర్ట్‌. అది చూసిన కెల్లీ తన ఎఫ్‌బీలో.. ‘కరోనా కారణంగా కీమో కోసం సందర్శకులను అనుమతించడం లేదు కానీ అవేవీ నా ఆల్బర్ట్‌ని ఆపలేకపోయాయి. నీ ప్రేమకు నా ధన్యవాదాలు’ అని రాసి సుదూరంగా కనిపిస్తున్న ఆల్బర్ట్‌తో సెల్ఫీ తీసుకుని పోస్ట్‌ చేసింది. ప్రేమ లోకాన్ని టచ్‌ చేసిన ఈ జంట ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని