దీపిక.. ది బిజినెస్‌ వుమన్‌!

సినిమా మెరుపులు ఉన్నంతవరకే వెలుగు. వరుసగా నాలుగు చిత్రాలు ఫట్‌మంటే పాపులారిటీ కనుమరుగైపోతుంది. ముఖ్యంగా హీరోయిన్లకు ఇది బాగా వర్తిస్తుంది. అందుకే ఒక్క దీన్నే నమ్ముకుంటే లాభం లేదనుకుంది దీపికా పదుకొణ్‌. తెలివిగా ఎప్పుడో వ్యాపారంలోకి దిగింది. తాజాగా ఓ స్టార్టప్‌లో రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టిందట. మిగతా ఇన్వెస్ట్‌మెంట్స్‌ మాటేంటంటే..

Published : 17 Jul 2021 01:37 IST

సినిమా మెరుపులు ఉన్నంతవరకే వెలుగు. వరుసగా నాలుగు చిత్రాలు ఫట్‌మంటే పాపులారిటీ కనుమరుగైపోతుంది. ముఖ్యంగా హీరోయిన్లకు ఇది బాగా వర్తిస్తుంది. అందుకే ఒక్క దీన్నే నమ్ముకుంటే లాభం లేదనుకుంది దీపికా పదుకొణ్‌. తెలివిగా ఎప్పుడో వ్యాపారంలోకి దిగింది. తాజాగా ఓ స్టార్టప్‌లో రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టిందట. మిగతా ఇన్వెస్ట్‌మెంట్స్‌ మాటేంటంటే..

దేళ్ల కిందట దీపిక బెంగళూరులో కేఏ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో కార్యాలయం తెరిచింది. అప్పట్నుంచి తన పెట్టుబడులన్నీ దీని ద్వారానే పెడుతోంది.

2017లో నీగీళిలినివిదివీ, FURLENCO,PURPIL' అనే రెండు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. మొదటి స్టార్టప్‌ దేశంలోని ప్రముఖ నగరాల్లో ఫర్నీచర్‌ని అద్దెకు ఇస్తుంటుంది. రెండోది సౌందర్యోపకరణాల అంకుర సంస్థ.

*  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన కొందరు ఔత్సాహికులు 2019లో ‘బెల్లాట్రిక్స్‌ ఏరోస్పేస్‌’ ప్రారంభించారు. ఈ స్పేస్‌ టెక్నాలజీ కంపెనీ అప్పట్లో రూ.21 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించింది. ఇందులో అత్యధికం దీపికవే.

*  డ్రమ్‌ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనూ తనకు వాటా ఉంది. ‘ఎపిగమియా’ బ్రాండ్‌ పేరుతో యోగర్ట్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తయారు చేస్తుందీ సంస్థ.

* దిల్లీ రాజధాని ప్రాంతంలో ‘బ్లూ స్మార్ట్‌’ కంపెనీ ఎలక్ట్రిక్‌ టాక్సీలు నడుపుతోంది. కొన్ని సంస్థలకు ఎలక్ట్రిక్‌ టెక్నాలజీని సైతం అందిస్తోంది. ఈ సంస్థకు మొదటి పెట్టుబడిదారుల్లో దీపిక ఒకరు.

*  ‘ఫ్రంట్‌ రో’ అనే ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం ప్రత్యేకంగా సెలెబ్రెటీలకే సంగీతం, క్రికెట్‌ పాఠాలు నేర్పిస్తుంటుంది. కామెడీ చేయడమెలాగో చెబుతుంది. ఇందులోనూ తనకు భారీ వాటాలున్నాయి.

లైవ్‌ మింట్‌ పత్రిక కథనం ప్రకారం దీపిక తాజాగా ‘సూపర్‌ టెయిల్స్‌’ అనే పెట్‌ స్టార్టప్‌లో దాదాపు రూ.20 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని