మనీతోనే మహదానందం

అనుభవాన్ని కాచి వడబోయకపోయినా పర్సు నిండుగా ఉంటేనే జల్సా చేయగలం అనే విషయం మిలీనియల్స్‌, జనరేషన్‌ జడ్‌కి బాగా తెలుసు. అందుకే డబ్బుతోనే ఖుషీ అని తేల్చేశారు. పంద్రాగస్టున ప్రముఖ డేటింగ్‌ యాప్‌ ఓకే క్యుపిడ్‌ జరిపిన అధ్యయనంలో  వారి అభిప్రాయాలు....

Published : 21 Aug 2021 03:28 IST

నుభవాన్ని కాచి వడబోయకపోయినా పర్సు నిండుగా ఉంటేనే జల్సా చేయగలం అనే విషయం మిలీనియల్స్‌, జనరేషన్‌ జడ్‌కి బాగా తెలుసు. అందుకే డబ్బుతోనే ఖుషీ అని తేల్చేశారు. పంద్రాగస్టున ప్రముఖ డేటింగ్‌ యాప్‌ ఓకే క్యుపిడ్‌ జరిపిన అధ్యయనంలో  వారి అభిప్రాయాలు.

* మీ దృష్టిలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం అంటే ఏంటి? అనే విషయంపై ఈ సర్వే చేశారు.

* ఆర్థిక స్వాతంత్య్రమే అసలైన స్వేచ్ఛ అనీ, డబ్బులుంటే ఏమైనా చేయొచ్చని 39శాతం కుర్రకారు అభిప్రాయం.

* దేశంమొత్తం స్వేచ్ఛగా తిరిగే అవకాశమే నిజమైన స్వాతంత్య్రం అన్నది.. 30 శాతం.

* పరిమితుల్లేని ప్రేమ, రొమాన్స్‌తో వచ్చే సుఖమే వేరు అన్నది.. 22శాతం.

* 9 శాతం మిలీనియల్స్‌ తమకిష్టమైన కళలు, రంగాల్లో ఆరితేరడానికి అవకాశం వస్తే మంచి సంతృప్తి ఉంటుందన్నారు.

* స్వేచ్ఛ, డబ్బు.. ఈ రెండింట్లో దేనికి ఓటేస్తారు అని అడిగినప్పుడు మాత్రం 65శాతం మంది ఫ్రీడమే ముఖ్యం అన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు