కావద్దు.. మరీ ‘స్మార్ట్’
అఖిల.. బీటెక్ మూడో ఏడాది. అందరిలాగే తనదీ స్మార్ట్ఫోనే. వాడే ల్యాప్టాప్ స్మార్టే. మూణ్నెల్ల కిందట పుట్టినరోజుకి నాన్న స్మార్ట్ వాచీ కొనిచ్చారు. అప్పట్నుంచే మొదలయ్యాయి కొత్త కష్టాలు. బ్రేక్ఫాస్ట్ చేసినా, డిన్నర్కి కూర్చున్నా ఆ వాచీలో తూకం వేయడమే! కేలరీల లెక్కలు తీయడమే!
అఖిల.. బీటెక్ మూడో ఏడాది. అందరిలాగే తనదీ స్మార్ట్ఫోనే. వాడే ల్యాప్టాప్ స్మార్టే. మూణ్నెల్ల కిందట పుట్టినరోజుకి నాన్న స్మార్ట్ వాచీ కొనిచ్చారు. అప్పట్నుంచే మొదలయ్యాయి కొత్త కష్టాలు. బ్రేక్ఫాస్ట్ చేసినా, డిన్నర్కి కూర్చున్నా ఆ వాచీలో తూకం వేయడమే! కేలరీల లెక్కలు తీయడమే! ఎక్కువ తింటే లావవుతాననే భయం. ఎప్పుడైనా గుండె కాస్త వేగంగా కొట్టుకున్నట్టు అనిపిస్తే వణుకు. వెంటనే ఈసీజీ తీసేస్తుంటుంది. కరోనా ముప్పు పోలేదంటూ మాటిమాటికీ ఆక్సిజన్ స్థాయిలు పరీక్షించుకుంటుంది. గ్యాడ్జెట్ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా బాడీలో ఏదో తేడా ఉందోననే ఆందోళన. మొత్తానికి చలాకీ పిల్ల కాస్తా చతికిలపడిపోయింది. ఆరోగ్య సమాచారం అందిస్తుందనుకున్న యంత్రం కాస్తా ఆమె పాలిట విలన్లా మారింది. ఇలాంటి అఖిలలు ఇప్పుడు కోకొల్లలు. ఈ భావననే ‘స్మార్ట్వాచ్ యాంగ్జైటీ’, ‘డిజిటల్ యాంగ్జైటీ’ అంటున్నారంతా. దీని బారిన పడుతోంది.. ఎక్కువ యువతే.
టెక్నాలజీ జోరు పెరుగుతున్నకొద్దీ కొత్త గ్యాడ్జెట్లు మార్కెట్ని ముంచెత్తడం మామూలే. అలా ఈ మధ్యకాలంలో కుర్రకారుని బాగా ఆకట్టుకుంటున్నవి స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ ట్రాకర్లు. పాటలు వినడం, సందేశాలు పంపుకోవడం, కరిగిన కెలోరీల లెక్కలేసుకోవడం, గుండె లయని గమనించడం, నాడి పట్టడం, బీపీ చూసుకోవడం, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు తెలుసుకోవడం... ఒకటేమిటి.. మణికట్టులో ఒదిగే ఈ స్మార్ట్ యంత్రాల ఫీచర్లు తక్కువేం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మన చెంతనుంటే ఓ వైద్యుడు వెంట ఉన్నట్టే. అంతవరకు బాగానే ఉందిగానీ ఈ ఆరోగ్య స్పృహ అధికమైతేనే వస్తుంది చిక్కంతా. పక్క దిగింది మొదలు.. బీపీలు చెక్ చేసుకోవడాలు.. హైరానా పడిపోవడం.. అస్తమానమూ నోటిఫికేషన్ల ధ్యాస.. ఈ డోసు పెరిగితేనే తిప్పలు. ఆరాటం, ఆతృత కాస్తా ఆందోళనగా మారుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అమెరికాలోని ... ఓ అమ్మాయి ఇలాగే లేనిపోని అనుమానాలతో తన యాపిల్ స్మార్ట్వాచీతో ఏడాదిలోనే 916 సార్లు ఈసీజీలు తీయించుకుందట. చివరికి వీళ్ల పరిస్థితి ఎలా తయారవుతుందంటే.. తనకు ఏదో అనారోగ్య సమస్య ఉందని తేలితే తప్ప ఈ ఆందోళన తగ్గదట. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు ఈ ‘వియరేబుల్ గ్యాడ్జెట్స్’ జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు మానసిక నిపుణులు. కనీసం వాడకాన్ని తగ్గించడం లేదా నోటిఫికేషన్లు ఆఫ్లో పెట్టమని సలహా ఇస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?