వ్యవసాయ స్నేహితులు
ఓ ఇద్దరు స్నేహితులు... ఒకరు పొలాల్ని చూస్తూ పెరిగితే... మరొకరు పొలాల్లోనే పెరిగారు... ఏరోస్పేస్ చదువులకెళ్లినా సాగు క్షేమాన్నే కోరుకున్నారు! రైతు రెక్కలకు పని భారం తగ్గించాలనుకున్నారు... పురుగు మందులు చల్లే డ్రోన్ రూపకల్పనే లక్ష్యంగా సాగారు...
వ్యవసాయ స్నేహితులు
ఓ ఇద్దరు స్నేహితులు... ఒకరు పొలాల్ని చూస్తూ పెరిగితే... మరొకరు పొలాల్లోనే పెరిగారు... ఏరోస్పేస్ చదువులకెళ్లినా సాగు క్షేమాన్నే కోరుకున్నారు! రైతు రెక్కలకు పని భారం తగ్గించాలనుకున్నారు... పురుగు మందులు చల్లే డ్రోన్ రూపకల్పనే లక్ష్యంగా సాగారు... పెట్టుబడి పెట్టేందుకు మరో ఫ్రెండ్ ముందుకొచ్చారు... ప్రయత్నానికో రూపం వచ్చింది... అదే ‘అటానమస్ ఫెస్టిసైడ్ స్ప్రేయింగ్ డ్రోన్’ ఆవిష్కరణకు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది! ఆ ముగ్గురు మిత్రులు హరీష్, ప్రశాంత్, ప్రత్యూష్...
ఆలోచనల్ని అంకుర సంస్థలుగా మలుస్తూ భిన్న రంగాల్లోకి యువత దూసుకెళ్తున్నారు. దీంట్లో భాగంగా వ్యవసాయ రంగానికి వూతమయ్యేలా ఈ ముగ్గురి ప్రయత్నం సాగిందిలా.... దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ కళాశాలకు చెందిన ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎ.హారీష్. బి.ప్రశాంత్ బీటెక్ నుంచీ బెస్ట్ ఫ్రెండ్స్. అభిరుచులే కాదు. లక్ష్యాలు కూడా ఒక్కటే. దీంతో ఎంటెక్ కాలేజీ ప్రాజెక్టు విషయంలోనూ ఆసక్తులు కలిసాయి. మూలాల్ని మరిచిపోకుండా రైతుల రెక్కల కష్టాన్ని కాస్త సులభతరం చేసేలా ఫెస్టిసైడ్ స్పెయింగ్ డ్రోన్ రూపకల్పనకే ఓటేసారు. వారి ఆలోచనకు అండగా నిలిచింది ఫిజియోథెరపిస్ట్ ప్రత్యూష్. డ్రోన్ల రూపకల్పనలో ఉన్న ఆసక్తే ప్రత్యూష్ని వీరికి దగ్గర చేసింది.
రూపకల్పన...
5 లీటర్ల సామర్థ్యం ఉన్న ఓ ప్లాస్టిక్ ట్యాంకు పైభాగంలో 3కె కార్భన్ఫైబర్ప్లేట్ను, ట్యాంక్కు కింది భాగంలో పురుగుల మందు చల్లే మోటార్ పంపును బిగించారు. కార్భన్ఫైబర్ప్లేట్పైన ఫ్లైయిట్ కంట్రోలర్ ఏర్పాటు చేశారు. కంట్రోలర్కి జీపీఎస్, టెలీమెట్రి, రెడియో రీసీవర్, 4కె కెమెరాతో పాటు నాలుగు వైపులా నాలుగు బ్రెష్లెస్ మోటార్లు బిగించారు. డ్రోన్ పైకి ఎగిరేందుకు 20 అంగుళాల ప్రొఫెర్లను వాడారు. పురుగు మందు పిచికారీ చేసేందుకు ట్యాంక్ కింద ఉన్న మోటార్పంప్కు రెండు మీటర్ల పొడవు ఉన్న 3కె కార్భన్ఫైబర్ ట్యూబ్ను బిగించారు. దానికి నాలుగు నాజిల్స్ అమర్చారు. దీంతో డ్రోన్కు రెండువైపులా రెండు మీటర్ల విస్తీర్ణంలో నాజిల్స్తో పురుగుమందులను చల్లుతుంది. పరికరం తయారీకి రూ.70 వేలుపైనే వెచ్చించారు.
పొలానికి సోకిన చీడపీడల్ని విశ్లేషించేందుకు డ్రోన్ని పొలంలో ఎగిరేలా చేసి కెమెరాతో ఫొటోలు తీయాలి. సేకరించిన ఫొటోలను ఇక్రిశాట్ వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన మొబైల్ యాప్లో అప్లోడ్ చేసి తెగుళ్లను విశ్లేషించొచ్చు. పంట సాగు, సోకిన తెగుళ్లపై అవగాహనకి వచ్చి మందుల్ని ఎంపిక చేసుకుని వాటిని ఎంత మోతాదులో చల్లాలో తెలుసుకోవచ్చు. నిమిషాల్లో పురుగు మందుల్ని సిద్ధం చేసి డ్రోన్తో చీడపీడలపై దాడికి దిగడమే. సాధారణంగా ఎకరా వరి పంటకు పురుగుమందు చల్లాలంటే కనీసం గంట సమయం పడుతుంది. కూలీలు తప్పని సరి. అయితే, వీరు రూపొందించిన డ్రోన్తో కూలీల సహాయం లేకుండా ఎకరా వరిపంటకు కేవలం 12 నిమిషాలలో మందు చల్లేయొచ్చు. డ్రోన్కి సంబంధించిన ఇతర వివరాలకు ఓ-ఓ.ఓఓఓ (o-o.ooo) సైట్ని చూడండి.
గుర్తింపు... * హైదరాబాద్ వేదికగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి ఆవిష్కరణలలో డ్రోన్ మొదటి స్థానంలో నిలిచింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. * హైదరాబాద్లోని వర్థమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఐఈఈఈ ఆధ్వర్యంలో మేకర్ ఫెయిర్ పేరిట ఈ నెలలో నిర్వహించిన అంతర్జాతీయస్థాయి పోటీలలో ద్వితీయ బహు మతిని గెలుచుకున్నారు. ఆసియా నుంచి మొత్తం 6 దేశాల నుంచి వచ్చిన ఆవిష్కర్తలతో పోటీపడ్డారు. |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న