Andhra News: చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేది ఉదయం 11గంటలకు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేది ఉదయం 11గంటలకు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను అడ్డుకుని, దూషించారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు. 1998 ఏపీ మహిళా కమిషన్ చట్టంలోని సెక్షన్-14 ప్రకారం కమిషన్కు కోర్టు తరహాలో విచారణ జరిపే అధికారాలున్నట్లు నోటీసుల్లో తెలిపారు.
‘‘అత్యాచార బాధితురాలిని కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో చంద్రబాబుతో వచ్చిన తెదేపా నాయకులు అడ్డుకొని గొడవకు దిగి ఉద్రిక్త పరిస్థితులు కల్పించారు. అక్కడి రోగులను భయాందోళనకు గురి చేసి నన్ను అసభ్య పదజాలంతో దూషించారు. గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారిని ఇలా అవమానించడం తీవ్రంగా పరిగణిస్తున్నాం. 1998 మహిళా కమిషన్ చట్టం సెక్షన్ 15(1) ప్రకారం విచారణకు ఆదేశిస్తున్నాం. నిర్దేశించిన సమయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలి. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు కూడా ఇదే తరహా నోటీసులు జారీ చేశాం. ఆయనకు కూడా ఈనెల 27వ తేది ఉదయం 11గంటలకు విచారణకు రావాలని ఆదేశించాం’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్