AP PGCET: ఏపీలో పీజీసెట్-2022 నోటిఫికేషన్‌ విడుదల

ఏపీలో పీజీసెట్- 2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు యోగివేమన వర్సిటీ వీసీ సూర్యకళావతి నోటిఫికేషన్‌

Published : 22 Jun 2022 22:35 IST

అమరావతి: ఏపీలో పీజీసెట్- 2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు యోగివేమన వర్సిటీ వీసీ సూర్యకళావతి నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొత్తం 145 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుకు జులై 20 చివరి తేదీ కాగా, ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దరఖాస్తు రుసుం ఓసీ అభ్యర్థులకు రూ.850, బీసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.650 చెల్లించాలి. డిగ్రీ చివరి సెమిస్టరులో ఉన్నవారు సైతం ఏపీపీజీసెట్-2022కు దరఖాస్తు చేసేందుకు అర్హులుగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని